హైదరాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ): ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్-2026)లో భాగంగా సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు, అనారోగ్యంతో ఉన్నవారు, విదేశాల్లో ఉన్న ఓటర్లకు జారీ చేసిన నోటీసుల పరిషారంలో భారత ఎన్నికల సంఘం వెసులుబాటు కల్పించింది. వారి తరఫున వయోజన కుటుంబసభ్యులు సంబంధిత ఎన్నికల అధికారుల ఎదుట వ్యక్తిగతంగా హాజరై అవసరమైన పత్రాలు, సమాచారాన్ని సమర్పించేందుకు అనుమతించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) సీ సుదర్శన్రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం మెమో జారీ చేశారు.
జీహెచ్ఎంసీ కమిషనర్, హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, రాష్ట్రంలోని కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులకు ఈ ఆదేశాలు పంపారు. వారు సంబంధిత ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు (ఈఆర్వోలు), అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులకు (ఏఈఆర్వోలు) తగిన సూచనలు ఇవ్వాలని పేరొన్నారు. నోటీసుల జారీ, వాటి పరిషారానికి అనుసరిస్తున్న విధానాన్ని ఈఆర్వోలు, ఏఈఆర్వోలు వారానికోసారి నిర్వహించే రాజకీయ పార్టీల సమావేశాల్లో వివరించాలని సూచించారు. నోటీసులు అందుకున్న ఓటర్లకు సంబంధించిన పత్రాలు, సమాచారాన్ని వారి తరఫున వయోజన కుటుంబసభ్యులు సమర్పించే విధానంపై స్పష్టత ఇవ్వాలని ఆదేశించారు.