మనోహరాబాద్, ఆగస్టు 30: దశాబ్దాలుగా వేదభూమిగా ఖ్యాతిగాంచిన మెదక్ జిల్లాలోని శివ్వంపేట శక్తిపీఠంగా విరాజిల్లనున్నది. బగళాముఖి అమ్మవారి దివ్య క్షేత్రంగా రూపుదిద్దుకోనున్నది. తెలంగాణలో వేదవిద్యకు దిక్సూచిగా నిలిచిన శాస్ర్తుల విశ్వనాథశాస్త్రి కుమారుడు శాస్ర్తుల వేంకటేశ్వర శర్మ.. అమ్మవారి ఆలయాన్ని నిర్మిస్తున్నారు. శక్తిపీఠం శిలాన్యాస కార్యక్రమం సోమవారం వేదమంత్రోచ్ఛరణాల మధ్య వైభవంగా జరిగింది. జడ్పీటీసీ పబ్బా మహేశ్గుప్తా నేతృత్వంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి, ఎమ్మెల్యేలు చిలుముల మదన్రెడ్డి, గూడెం మహిపాల్రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్రెడ్డి హాజరై పూజలు చేశారు. మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, హైదరాబాద్ సహా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరై శిలాన్యాస కార్యక్రమాన్ని తిలకించారు. ఈ కార్యక్రమంలో వేదపండితులు గంగవరం నారాయణశర్మ, పురాణం మహేశ్వరశర్మ, రాము శర్మ, శాస్ర్తుల దేవదత్త శర్మ, వేణుగోపాల్ శర్మ, దత్తాత్రేయశర్మ, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.