ములుగు రూరల్, జనవరి 10: వన్యప్రాణుల కోసం వేటగాళ్లు అమర్చిన విద్యుత్తు తీగ తగిలి రైతు మృతి చెందిన ఘటన ములుగు మండలం పెగడపల్లి గ్రామంలో చోటుచేసుకొన్నది. వివరాల్లోకెళ్తే.. పెగడపల్లికి చెందిన రైతు మీనుగు సాంబయ్య (42) నీళ్లు పారించేందుకు మంగళవారం రాత్రి తన భార్య మణెమ్మతో కలిసి పొలానికి వెళ్లాడు.
ట్రాన్స్ఫార్మర్ ఆన్ చేసేందుకు వెళ్లగా వన్యప్రాణుల కోసం అమర్చి ఉన్న విద్యుత్తు తీగ తగలడంతో షాక్కొట్టింది.ఎంజీఎంలో చికిత్సపొందుతూ బుధవారం మృతి చెందాడు. సాంబయ్యకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కాగా దుబ్బగూడెంకు చెందిన ఈసం ముత్తారావు, ఈసం అశోక్, ఈసం లక్ష్మనర్సు, ఆగబోయిన లక్ష్మయ్య, ఆలూరి ప్రశాంత్ విద్యుత్తు తీగను అమర్చినట్టు తమ విచారణలో తేలిందని ఎస్సై తెలిపారు.