హైదరాబాద్, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ): పోలింగ్ రోజు.. పొద్దున్నే ప్రజలు ఓటువేయటానికి వెళ్తున్న సమయంలో.. బీఆర్ఎస్ ప్రభుత్వ క్రెడిబిలిటీని దెబ్బతీసేలా ఒక్కసారిగా ప్రచారం మొదలయ్యే ప్రమాదమున్నదని బీఆర్ఎస్ నేతలు అనుమానం వ్యక్తంచేశారు. బుధవారం ప్రముఖ న్యూస్ చానల్ టీవీ 9 సర్వే పేరుతో ఓ నకిలీ సర్వేను సోషల్మీడియాలో భారీగా సర్క్యులేట్ చేశారు. పోలింగ్ రోజు ఇలాంటి ప్రచారాలు మరింత తీవ్ర కావచ్చని తెలుస్తున్నది. డీప్ ఫేక్ టెక్నాలజీని వినియోగించి బీఆర్ఎస్ కీలక నేతలపై అవినీతి, అక్రమాల పేరుతో తప్పుడు ప్రచారం జరిగే ప్రమాదం ఉన్నదని ఆ పార్టీ నేతలు బుధవారం ఆందోళన వ్యక్తంచేశారు. పోలింగ్కు ముందు ఓటర్లను తికమకపెట్టేందుకు కొన్ని పార్టీలు కుట్రలకు తెరలేపినట్టు సమాచారం.
టీవీ 9 సర్వే పేరుతో ప్రచారమైన ఫేక్ సర్వేలో ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోతుందంటూ తలాతోక లేని లెక్కలతో ఓటర్లను గందరగోళపర్చే ప్రయత్నాలు జరిగాయి. ఇలాంటివే మరికొన్ని సోషల్మీడియాలో పోటెత్తవచ్చని బీఆర్ఎస్ నేతలు అనుమానిస్తున్నారు. దుబ్బాక ఉప ఎన్నిక సమయంలో కూడా ఇలాంటి ప్రచారమే జరిగింది. పోలింగ్ రోజు కాంగ్రెస్ అభ్యర్థి బీఆర్ఎస్లోకి పోవటానికి సిద్ధమయ్యాడంటూ బీజేపీ సోషల్మీడియాలో నకిలీ ప్రచారానికి తెరలేపింది. దీంతో చాలామంది ఓటర్లు తికమకపడి కాంగ్రెస్కు వేయాలనుకొన్న ఓట్లను బీజేపీకి వేశారు. ఇప్పుడు కూడా ఇలాంటి ప్రచారమే జరుగబోతున్నట్టు తెలిసింది. ఎన్ని గ్యారెంటీలిచ్చి, అరిచి పెడబొబ్బలు పెట్టినా ప్రజలు పట్టించుకోకపోవటంతో దింపుడు కల్లం ఆశగా కాంగ్రె స్ పార్టీ ఇలాంటి కుట్రలకు తెరలేపే ప్రమాదం ఉన్నదని బీఆర్ఎస్ నేతలు అనుమానిస్తున్నారు. పోలింగ్ రోజు ఇలాంటి నకిలీ ప్రచారం ఒక్కసారిగా గుప్పుమంటే నిజం బయటకు వచ్చేటప్పటికీ పోలింగ్ ముగిసి పోతుంది. ఆలోపు డబ్బాలో ఓట్లు పడిపోతాయి. ఆ తర్వాత నిజం తెలిసినా చేయగలిగేదీ ఏమీ ఉండదు.
టీవీ 9 సత్తాబజార్ పేరిట ప్రచారమైన సర్వేలో కాంగ్రెస్ పార్టీ జిల్లాలవారీగా ఇన్ని సీట్లు గెలవబోతున్నదని ఉన్నది. ఆ సర్వేను బాగా చదువుకొన్నవాళ్లు, రాజకీయాల్లో ఉన్నవారు కూడా నమ్మేలా రూపొందించారు. అలాంటిది సామాన్యులు అది నిజమని నమ్మ టం పెద్ద కష్టమేమీ కాదు. ఈ కుట్రలకు కొనసాగింపుగా ముఖాలను మార్చి బీఆర్ఎస్ ముఖ్య లు డబ్బు సంచుల గురించి, అవినీతి అక్రమాల గురించి అంతర్గతంగా చర్చించుకొంటున్నట్టు నకిలీ వీడియోలను కొందరు విపక్ష వ్యూహకర్తలు బుధవారమే సిద్ధం చేసినట్టు బీఆర్ఎస్ వర్గాల సమాచారం.
బీఆర్ఎస్పై వ్యతిరేకతను ప్రేరేపించేందుకు టెక్నాలజీని దారుణంగా వాడుకొనే కుట్రలు జరుగుతున్నాయని సమాచారం. కొడంగల్లో బీఆర్ఎస్ ఓడిపోతుందని మంత్రి కేటీఆర్ అన్నట్టుగా ఇప్పటికే ఓ ఫేక్ ఆడియోను విపక్షాలు రూపొందించాయని, గెలిచిన ఎమ్మెల్యేలతో క్యాంప్ ప్లాన్ చేస్తున్నట్టు కూడా మరో ఫేక్ ఆడియోను తయారు చేశాయ ని, వాటిని సోషల్మీడియాలో పోలింగ్ రోజు విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నాయని సమాచారం. ఇలాంటి కుట్రలపై బీఆర్ఎస్ కార్యకర్తలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉం డి, ప్రజలను చైతన్యపర్చాలని పార్టీ అధిష్ఠానం కోరింది. ఫేక్ ప్రచారంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైంది.