హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ): బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ శతాబ్ది వేడుకలు అట్టహాసంగా ముగిశాయి. బుధవారం రాత్రి స్కూల్ ఆవరణలో ‘ఏ నైట్ ఆఫ్ ఆనర్స్’ కార్యక్రమం నిర్వహించారు.
ఇందులో పూర్వవిద్యార్థులు అడోబ్ సీఈవో శంతను నారాయణ్, కూ ఆఫ్ ప్రోక్టర్ అండ్ గ్యాంబుల్ శైలేశ్ జెజురీకర్, ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్రెడ్డిలను ‘గ్లోబల్ ఇంపాక్ట్’ అవార్డులతో పాఠశాల యాజమాన్యం గౌరవించింది. హెచ్పీఎస్ సొసైటీ ప్రెసిడెంట్ గుస్తీ నోరియా, కార్యదర్శి-కోశాధికారి జలగం వెంకట్రావు, ప్రిన్సిపాల్ డాక్టర్ స్కంద్ బాలి ఆధ్వర్యంలో పాఠశాల అభివృద్ధికి కృషి చేసిన పూర్వపు అధ్యక్షులతోపాటు ప్రతినిధుల త్యాగాలను కీర్తించారు.