సంగారెడ్డి : నిత్యం ప్రభుత్వ కార్యక్రమలతో బిజీగా ఉండే తెలంగాణ శాసన మండలి ప్రొటెం చైర్మన్ వీ భూపాల్ రెడ్డి తన చిన్ననాటి స్నేహితులను శనివారం కలుసుకున్నారు. సంగారెడ్డి జిల్లా పఠాన్ చెరు పట్టణంలో, చిట్కుల్ గ్రామంలో తన చిన్ననాటి స్నేహితులను కలిసి ఆప్యాయంగా పలుకరించారు. ప్రొటెం చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన తరువాత మొదటగా తమ గ్రామానికి వచ్చిన భూపాల్ రెడ్డికి స్నేహితులు, గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. చిన్ననాటి విషయాలను గుర్తు చేసుకుంటు దోస్తులతో ఆప్యాయంగా మాట్లాడిన భూపాల్ రెడ్డి ఆనాటి మధుర జ్ఞాపకాలను నెమరేసుకున్నారు. ఈ కార్యక్రమంలో వడ్డేపల్లి రాంరెడ్డి, నర్సింగ రావు, మాజీ జడ్పీటీసీ జైపాల్ తదితరులు పాల్గొన్నారు.