దేశానికే ఆదర్శంగా కేసీఆర్ పాలన
రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్
రామగిరి మండలంలో అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం
రామగిరి, ఏప్రిల్ 6: రైతువేదికలు అన్నదాతల అధ్యయన కేంద్రాలని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని సుందిళ్ల, రత్నాపూర్ గ్రామాల్లో పలు అభివృద్ధి పనులను ఎంపీ వెంకటేశ్నేత, జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్తో కలిసి ఆయన ప్రారంభించారు. సుందిళ్లలో రైతువేదికను ప్రారంభించి అనంతరం గ్రామపంచాయతీ షాపింగ్ కాంప్లెక్స్, కమ్యూనిటీ హాల్, ప్రహరీ నిర్మాణానికి భూమిపూజ చేశారు. అనంతరం రత్నాపూర్లో నిర్మించిన రైతు వేదిక, సెగ్రిగేషన్ షెడ్డు, పల్లె ప్రకృతి వనం, ఎమ్మార్సీ భవనాలను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ రైతులను రాజుగా చూడాలని గ్రామగ్రామాన రైతువేదికలను నిర్మించడం గొప్ప విషయమన్నారు. ఒకప్పుడు వ్యవసాయమే దండగ అనుకునే రోజులుండేవని, తెలంగాణ సాధించుకున్నాక సీఎం కేసీఆర్ అద్భుతంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుతో గోదావరి ఎదురెక్కి పారడంతో యువత కూడా వ్యవసాయం వైపు దృష్టి సారిస్తున్నారన్నారు. జడ్పీ చైర్మన్ పుట్ట మధు మాట్లాడుతూ.. తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్ నాయకత్వంలో కాళేశ్వరం లాంటి అద్భుతమైన ప్రాజెక్టుతో ఏడాదికి మూడు పంటలు సాగు చేసుకునే వీలుందన్నారు. పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేతమాట్లాడుతూ.. దేశానికే ఆదర్శవంతంగా రైతాంగాన్ని తీర్చిదిద్దే దిశగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తున్నదన్నారు. రెండు జాతీయ అవార్డులు పొందిన సుందిళ్ల గ్రామానికి ఎంపీ ఫండ్స్ నుంచి రూ.10లక్షలను గ్రామాభివృద్ధికి కేటాయిస్తానని తెలిపారు. నానాజీ దేశ్ముఖ్ రాష్ట్రీయ గౌరవ్ గ్రామసభ అవార్డు, గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ ప్లాన్ అవార్డులు పొందిన సుందిళ్ల సర్పంచ్ దాసరి లక్ష్మిని సన్మానించారు. రామగిరి ఎంపీపీ ఆరెల్లి దేవక్క, జడ్పీటీసీ శారద, రత్నాపూర్ సర్పంచ్ పల్లె ప్రతిమ, ఎంపీటీసీ సంపత్, కమాన్పూర్ ఏఎంసీ చైర్మన్ పూద రి సత్యనారాయణ, సహకార సంఘం చైర్మన్ భాస్కర్రావు, రైతుబంధు అధ్యక్షుడు కుమార్, బండి సుశీల, డీఏవో తిరుమల్ ప్రసాద్, ఆర్డీవో కృష్ణవేణి, ఎంపీడీవో విజయ్కుమార్, తహసీల్దార్ పుష్పలత, ఎంఏవో మోహన్, ఏఈవో మృగనయని, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు శెంకేసి రవీందర్, పీవీ రావు, ఆరెల్లి కొమురయ్యగౌడ్, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
ఫూలే, అంబేద్కర్ విగ్రహాల ఆవిష్కరణ
సెంటినరీకాలనీలోని అంగడి బజార్లో ఏర్పాటుచేసిన మహాత్మా జ్యోతిబా ఫూలే, అంబేద్కర్ విగ్రహాలను రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ మంగళవారం ఎంపీ వెంకటేశ్ నేత, జడ్పీ చైర్మన్ పుట్ట మధుతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి అంబేద్కర్, ఫూలే సేవలను కొనియాడారు. బడుగు, బలహీనవర్గాల వారు విద్యావంతులు కావాలన్నదే మహానీయుల ఆశయమని, బహుజనులు చదువుకుంటేనే వారి కలలు సాకారమవుతాయన్నారు. అందరికీ విద్య అందించాలన్న లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం కేజీ టూ పీజీ విద్యను అందుబాటులోకి తీసుకువచ్చిందన్నారు. ఎంపీ వెంకటేశ్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం దేశానికి ఏం చేసిందో బీజేపీ నేతలు బహిరంగ చర్చకు రావాలని సవాల్ చేశారు. బండి సంజయ్ తన స్థాయిని మరిచి సీఎం కేసీఆర్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. మరోసారి పిచ్చి కూతలు కూస్తే సహించేది లేదన్నారు. కార్యక్రమంలో భూపాలపల్లి జడ్పీ చైర్పర్సన్ జక్కు శ్రీహర్షిణి, మంథని మున్సిపల్ చైర్పర్సన్ పుట్ట శైలజ, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్, టీబీజీకేఎస్ అధ్యక్షుడు వెంకట్రావ్, ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, ఎంపీపీ ఆరెల్లి దేవక్క, జడ్పీటీసీ శారద, ఏఎంసీ చైర్మన్ సత్యనారాయణ, నాయకులు తగరం శంకర్ లాల్, ఆసం తిరుపతి, పంజాల శ్రీనివాస్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.