న్యూఢిల్లీ, డిసెంబర్ 1: జాతీయ వైద్య కమిషన్(ఎన్ఎంసీ) చిహ్నంలో మార్పులపై వివాదం రేగింది. ఎన్ఎంసీ లోగోలో తాజాగా చేసిన మార్పులు ఆమోదయోగ్యం కాదని ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) కేరళ చాప్టర్ అధ్యక్షుడు గురువారం ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. లోగోలో లౌకిక సందేశం ఉండి ఉంటే మరింత సమంజసంగా, ఆమోదయోగ్యంగా ఉండేదని తెలిపారు.
ఐఎంఎ జాతీయ నాయకత్వం లోగో మార్పుపై తీవ్ర నిరసన వ్యక్తం చేయాలని కోరారు. గతంలో జాతీయ చిహ్నం(సారనాథ్ స్తూపం నుంచి తీసుకున్నది) లోగోలో ఉండేదని.. కానీ దాని స్థానంలో హిందూ దేవతల వైద్యుడైన ధన్వంతరిని ఫొటోను ఉంచారని ఆయన విమర్శించారు. దీని పై ఎన్ఎంసీ నైతిక విలువలు, వైద్య రిజిస్ట్రేషన్ బోర్డ్ అధిపతి, మీడియా విభా గం అధిపతి యోగేందర్ మాలిక్ శుక్రవారం స్పందించారు. ధన్వంతరి చిత్రమున్న లోగోను ఏడాదికి క్రితం నుంచి వాడుతున్నామని.. ఇండియా పేరు స్థా నంలో భారత్ అనే మార్పును మాత్రమే నెలన్నర క్రితం చేర్చామని తెలిపారు.