ముంబై: టీవీ కమేడియన్, డ్యాన్స్ దీవానే హోస్ట్ భారతిసింగ్ తనకు ప్రస్తుత పరిస్థితుల్లో
పిల్లలను కనాలని లేదని లైవ్ షోలో చెప్పింది. 14 రోజుల బిడ్డను కరోనా వల్ల కోల్పోయిన
తల్లి విషాదం తెలిపేందుకు ఉద్దేశించిన ఓ డ్యాన్స్ ఐటం ముగిసిన తర్వాత భారతి భర్త హార్ష్
లింబాచియాతో కలిసి స్టేజి మీదకు వెళ్లి కన్నీళ్లు పెడుతూ మాట్లాడింది. కేవలం కరోనా
కారణంగానే ప్రస్తుతానికి తాను పిల్లలను కనాలని అనుకోవడం లేదని భారతి
చెప్పినప్పుడు ప్రేక్షకులు కదిలిపోయారు. “మేము ఓ బిడ్డను కనాలని అనుకున్నాం..
కానీ ఇలాంటి సంఘటనలు విన్నాక వద్దని తీర్మానించుకున్నాం.. ఇది మేము కావాలనే
తీసుకున్న నిర్ణయం.. ఇలాంటి విషాదాలు ఇంకా కొనసాగడానికి వీల్లేదు.. ఈ ఐటంలోని
తల్లి దుస్థితి నాకు రాకూడదని అనుకున్నాను” అని భారతి కన్నీళ్లు జలజలా రాలుతుంటే
చెప్పింది. డాన్స్ ప్రోగ్రాంకు జడ్జీలుగా వచ్చిన నోరా ఫతేహీ, తుషార్ కాలియా కూడా
కంటతడిపెట్టడం కనిపించింది.