కంటోన్మెంట్, జూన్ 8 : పార్టీ నియమావళిని ఉల్లంఘించి మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్పై ఫ్లెక్సీలు ఏర్పాటుచేసిన కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు, సివిలియన్ నామినేటెడ్ మాజీ సభ్యుడు జే రామకృష్ణపై బీజేపీ వేటు వేసింది. పార్టీ నియమావళిని అతిక్రమించినందుకు బీజేపీ ప్రాథమిక సభ్యత్వం నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ కన్వీనర్ రవీందర్ విశ్వనాథ్ సోమవారం లేఖ ద్వారా ప్రకటించారు.