హైదరాబాద్ : మందుబాబులకు శుభవార్త. బీర్ల ధరను తగ్గిస్తూ రాష్ర్ట ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. బీరు సీసాపై రూ. 10 తగ్గిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రత్యేక ఎక్సైజ్ సెస్ పేరుతో సీసాపై రూ. 30 ప్రభుత్వం విధించిన సంగతి తెలిసిందే. ఈ ప్రత్యేక ఎక్సైజ్ సెస్ నుంచి రూ. 10 తగ్గించింది ప్రభుత్వం. ప్రత్యేక సెస్ తగ్గింపు ఇవాళ్టి నుంచే అమల్లోకి వచ్చినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.