హైదరాబాద్, మే 25 (నమస్తే తెలంగాణ): మహాత్మా జ్యోతిబాఫూలే తెలంగాణ బీసీ సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలోని డిగ్రీ, ఇంటర్ గురుకులాల్లో ప్రవేశాల కోసం 51,05 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇంటర్ కోర్సుల కోసం 45,735 మంది, మహిళా డిగ్రీ కాలేజీలో ప్రవేశం కోసం 6,170 మంది దరఖాస్తు చేసుకున్నట్టు సంస్థ కార్యదర్శి మల్లయ్య భట్టు బుధవారం తెలిపారు. వీరికి జూన్ 5న ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు. బీసీ సంక్షేమ గురుకులాల్లో 6, 7, 8 తరగతుల్లో సీట్ల భర్తీకి జూన్ 2లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. 19న ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు. వివరాలకు mjptbcwreis.telangana.gov.in, 040-2332 2377, 23328266 సంప్రదించాలని సూచించారు.