హైదరాబాద్ : కరోనాపై ప్రజల్లో అవగాహన పెరిగిందని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు అన్నారు. ప్రజలు మాస్కులు ధరించి అన్నిజాగ్రత్తలు పాటిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
కరోనా వైరస్ కట్టడికి ప్రభుత్వం సైతం అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
‘‘రాష్ట్రవ్యాప్తంగా నిన్న ఒక్కరోజే రికార్డు స్థాయిలో లక్షకు పైగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేశాం. లక్షకు పైగా టీకాలనూ పంపిణీ చేశాం.
రాష్ట్రంలో 11 వందలకుపైగా కేంద్రాల్లో వ్యాక్సినేషన్ కొనసాగుతుంది. 1,064 కేంద్రాల్లో యాంటీజన్ పరీక్షలు నిర్వహిస్తున్నాం. కొత్త జిల్లా కేంద్రాల్లో త్వరలో ఆర్టీ-పీసీఆర్ పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేస్తాం.
స్వైరో సర్వే కోసం ఎన్ఐఎన్ ( నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రీషియన్)ను కోరాం. రానున్న రోజుల్లో హైదరాబాద్ మినహా అన్ని జిల్లాల్లో స్వైరో సర్వే నిర్వహిస్తాం’’ అని ఆరోగ్యశాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి