వరంగల్ : భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ఆదేశించారు. ఆదివారం వరంగల్ టౌన్లోని ఏషియన్ మాల్ వెనుక గల అంబేద్కర్ నగర్ లోని లోతట్టు ప్రాంతాలను ఆయన పరిశీలించారు. ఆ ప్రాంతపు ప్రజల సౌకర్యార్థం సాయిబాబా గుడి సమీపంలో పునరావాసం కల్పించినట్లు తెలిపారు. నాలలను పరిశీలించి వరద నీరు వెళ్లేలా చెత్తా ఎప్పటికప్పుడు తొలగించాలని ఆదేశించారు.
జలమయమైన ప్రాంతాల్లోని ప్రజలకు సత్వర సహాయం అందించుటకు బల్దియా ఆధ్యర్యంలో 24 గంటలు పని చేసే కంట్రోల్ రూమ్ 1800 425 1980 టోల్ ఫ్రీ, 97019 99645 మొబైల్, 79971 00300 వాట్సప్ నంబర్లు ఏర్పాటు చేసినట్లు అర్బన్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. 12 జేసీబీలు, 4 డోజర్ బండ్లను అందుబాటులో ఉంచుతూ అవసరమైన చోట యంత్రాలను వినియోగించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు ఎలాంటి ధన, ప్రాణ నష్టం జరగకుండా అన్ని చర్యలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు.
నగర మేయర్ గుండు సుధారాణి మాట్లాడుతూ.. భారీ వర్షాల నేపద్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. అదికారులు అప్రమత్తంగా ఉండి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలన్నారు. ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో వాసు చంద్ర, బల్దియా ఎస్ఈ సత్యనారాయణ, సీహెచ్ఓ డాక్టర్ రాజారెడ్డి, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.