హైదరాబాద్, ఫిబ్రవరి 27 (నమస్తే తెలంగాణ): ఎక్సైజ్, నీటిపారుదల శాఖలో ఉద్యోగుల పదోన్నతుల కల్పనకు ప్రభుత్వం డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీ (డీపీసీ)లను నియమించింది. ఎక్సైజ్ శాఖలో మొదటి, రెండవ స్థాయి గెజిటెడ్ పోస్టుల్లోకి పదోన్నతుల కోసం ఈ కమిటీని ఏర్పాటు చేసినట్టు తెలిపింది. కమిటీకి ఎక్సైజ్ శాఖ కమిషనర్ సభ్య కార్యదర్శిగా వ్యవహరించనుండగా, వాణిజ్యపన్నుల శాఖ కమిషనర్, జీఏడీ కార్యదర్శి సభ్యులుగా ఉంటారని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునిల్ శర్మ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.