హైదరాబాద్, జనవరి 16 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానల్లో 2011 జనవరి 1కి ముందు చికిత్స పొందిన వ్యక్తుల కేస్-షీట్లను ధ్వంసం చేయనున్నట్టు మెడికల్ రికార్డ్స్ విభాగం తెలిపింది. ఈ మేరకు నిరుడు జూన్ 15న నోటిఫికేషన్ జారీ చేసినట్టు వెల్లడించింది. ఆ తేదీకి ముందు చికిత్స పొందినవారు ఎవరైనా తమ రికార్డులు కావాలనుకొంటే తమ విభాగానికి వచ్చి దరఖాస్తు చేసుకొని, తీసుకెళ్లాల్సిందిగా సూచించింది.