నవాబ్పేట, ఫిబ్రవరి 29 : ఊర కుక్కల దాడిలో( Dog attack )జింక మృతి(Deer died) చెందిన ఘటన మహబూబ్నగర్ (Mahabubnagar) జిల్లా నవాబ్పేట మండలంలోని ఫత్తేపూర్ మైసమ్మ ఆలయ సమీపంలో ఉన్న అడవిలో గురువారం చోటు చేసుకున్నది. ఫారెస్ట్ అధికారుల కథనం మేరకు.. అడవిలో కొంత కాలంగా జింకలు, అడవి పందులు, నెమళ్ల సంఖ్య బాగా పెరిగింది.
ఈ క్రమంలో గురువారం ఉదయం చుక్కల జింక అటవీ ప్రాంతంలో తిరుగుతుండగా.. ఆలయ ఆవరణలో ఉన్న ఊర కుక్కలు గమనించి మూకుమ్మడిగా దాడి చేశాయి. దీంతో జింక అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలుసుకున్న అటవీ అధికారులు కృష్ణయ్య, సుకన్య ఘటనా స్థలికి చేరుకొని పంచనామా నిర్వహించారు. అనంతరం వెటర్నరీ డాక్టర్ రాంప్రసాద్ సమక్షంలో జింకకు పోస్టుమార్టం చేశారు. కుక్కల దాడిలోనే జింక మృతి చెందినట్లు పోస్టుమార్టంలో తేలిందని బీట్ ఆఫీసర్ సుకన్య తెలిపారు.