హైదరాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ) : 2026-27 విద్యాసంవత్సరానికి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విద్యాలయం పరిధిలోని కళాశాలల్లోని బీఎస్సీ(ఆనర్స్) అగ్రికల్చర్, బీటెక్(ఫుడ్ టెక్నాలజీ) కోర్సుల్లోని రెగ్యులర్ సీట్ల భర్తీకి రెండో రోజు కౌన్సెలింగ్ పూర్తయ్యే వరకు 465 సీట్లు భర్తీ అయినట్టు వర్సిటీ వీసీ డాక్టర్ అల్దాస్ జానయ్య తెలిపారు. మొదటి రోజు 213 సీట్లు, రెండో రోజు శుక్రవారం జరిగిన కౌన్సెలింగ్లో 242 సీట్లు పూర్తయినట్టు చెప్పారు. శనివారం సాయంత్రం 5 గంటలకు మొదటి విడత కన్వీనర్ కోటా సీట్లు భర్తీ అవుతాయని, అనంతరం ప్రత్యేక కోట సీట్ల భర్తీకి కౌన్సెలింగ్ నిర్వహిస్తామని వీసీ అల్దాస్ జానయ్య వెల్లడించారు.
హైదరాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ) : రెండేండ్ల బీఈడీ కోర్సుల సీట్ల భర్తీకి ఎడ్సెట్ రెండో విడత కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలయ్యింది. ఈ కౌన్సెలింగ్ శనివారం నుంచి ప్రారంభమవుతుందని ప్రవేశాల కమిటీ కన్వీనర్ ప్రొఫెసర్ పాండురంగారెడ్డి తెలిపారు. శనివారం నుంచి సెప్టెంబర్ 3 వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్, సర్టిఫికెట్ వెరిఫికేషన్, 6 నుంచి 8 వరకు వెబ్ ఆప్షన్లు, 9న వెబ్ ఆప్షన్ల ఎడిటింగ్కు అవకాశం కల్పించామని పేర్కొన్నారు. 12న సీట్లు కేటాయిస్తామని, సీట్లు పొందిన వారు 15 నుంచి 19 వరకు కాలేజీల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుందని తెలిపారు.