హైదరాబాద్ : దక్షిణ మధ్య రైల్వే జోన్, సౌత్ వెస్ట్రన్ రైల్వే జోన్ ఆధ్వర్యంలో కలిపి మొత్తం 36 రైలు సర్వీసును రద్దు చేస్తూ సోమవారం రైల్వే అధికారులు నిర్ణయం తీసుకున్నారు. చామరాజనగర్-తిరుపతి, చెన్నై-తిరుపతి రైల్వే స్టేషన్ల మధ్య 12 రైళ్లు, సికింద్రాబాద్-పాట్నా, వాస్కోడిగామా-జసిద్హి, దానాపూర్-బెంగళూర్, చెన్నై-లక్నో, నిజాముద్దీన్-చెన్నై, గోరఖ్పూర్-యశ్వంత్పూర్ వంటి పలు రైల్వే స్టేషన్ల పరిధిలో 20 సర్వీసులను రద్దు చేసినట్లు తెలిపారు.
మరో 12 రైళ్లు పాక్షికంగా రద్దు చేసినట్లు అధికారులు వెల్లడించారు. దండ్-నిజామాబాద్, నిజామాబాద్-పందాపూర్, నిజామాబాద్-పూణే మధ్యలో నాలుగు సర్వీసులు ఈ నెల 11 నుంచి 30 వరకు రద్దు చేశామన్నారు. ఈ నెల 14, 16, 20, 22, 23,25, 27 వరకు 20 రైళ్లను సర్వీసుల వారీగా రద్దు చేసినట్లు తెలిపారు.