కుమ్రంభీం ఆసిఫాబాద్ : ఎన్నికల కోడ్(Election Code) నేపథ్యంలో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు.
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి(Wankidi check post) మండలంలోని ఇంటర్ స్టేట్ చెక్ పోస్ట్ వద్ద గురువారం వాహనాల తనిఖీల్లో సరైన ఆధారాలు లేకుండా తరలిస్తున్న వేర్వేరు వ్యక్తుల నుంచి రూ.2.25 లక్షలు పట్టుకున్నట్లు ఎస్ఐ సాగర్ తెలిపారు.
మహారాష్ట్రకు(Maharashtra) చెందిన శ్రీనివాస రావు వద్ద రూ.లక్ష, బల్లార్షాకు చెందిన సంజీవ్ తన కారులో ఆసిఫాబాద్కు వెళ్తుండగా రూ. లక్షా 25 వేలు పట్టుకున్నట్లు వివరించారు. సరైన ఆధారాలు లేకపోవడంతో నగదును సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. ఈ తనిఖీల్లో కెరమెరి ఎంపీఓ అమ్జాద్ పాషా, జూనియర్ అసిస్టెంట్ బాబు భాస్కర్, హెడ్ కానిస్టేబుల్ శివాజీ ఉన్నారు.