హైదరాబాద్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ): ఏపీలోని కర్నూలు జిల్లాలో ఓ రైతును అదృష్టం వరించింది. తుగ్గలి మండలం జీ ఎర్రగుడి గ్రామానికి చెందిన ఆ రైతు కుమార్తె టమాటా తోటలో కలుపు తీస్తుండగా 10 క్యారెట్ల బరువైన డైమండ్ లభించింది.
ఈ విషయాన్ని తెలుసుకొన్న పెరవళి, జొన్నగిరి ప్రాంతానికి చెందిన కొందరు వ్యాపారులు ఆ రైతును సంప్రదించారు. వ్యాపారులంతా కలిసి వజ్రాన్ని రూ.34 లక్షలకు కొనుగోలు చేసినట్టు సమాచారం. ఏటా తొలకరి వర్షాలు కురిసిన తర్వాత జొన్నగిరి, పగడిరాయి, జీ ఎర్రగుడి, తుగ్గలి ప్రాంతాల్లోని పొలాల్లో వజ్రాలు లభించడం సాధారణమేనని స్థానికులు చెప్తున్నారు.