న్యూఢిల్లీ, మే 20: అంతర్జాతీయంగా చక్కెర ధరలు పెరుగుతుండటంతో వాటి ఎగుమతులపై రాయితీని కేంద్రప్రభుత్వం తగ్గించింది. టన్ను చక్కెరకు ప్రస్తుతం ఇస్తున్న రూ.6వేల సబ్సిడీని రూ.4వేలకు తగ్గించింది. ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుందని, అంతర్జాతీయంగా ధరలింకా పెరిగితే సబ్సిడీలో మరింత కోత ఉండవచ్చని తెలిపింది. రాయితీ తగ్గింపు ప్రభావం ఎగుమతులపై ఉండబోదని చక్కెరకు డిమాండ్ బాగా ఉందని స్పష్టం చేసింది. చక్కెర ఎగుమతులను పెంచడం, మిల్లుల యజమానులు రైతులకు వేగంగా చెల్లింపులు చేయడం కోసం కేంద్రం 2020-21 మార్కెట్ ఏడాది (అక్టోబర్-సెప్టెంబర్)లో టన్నుకు రూ.6వేలు సబ్సిడీని నిర్ణయించింది. మొత్తం 60 లక్షల టన్నుల చక్కెర ఎగుమతి చేయాలని లక్ష్యం పెట్టుకోగా ఇప్పటివరకు 57 లక్షల టన్నుల ఎగుమతి జరిగింది. దేశంలో ఈ ఏడాది 3 కోట్ల టన్నుల చక్కెర ఉత్పత్తి అవుతున్నది