‘నమస్తే తెలంగాణ, ముల్కనూరు ప్రజాగ్రంథాలయం’ సంయుక్తంగా నిర్వహించిన ‘కథల పోటీ-2021’లో ప్రత్యేక బహుమతి పొందిన కథ.
అది వీర్లపూడికి దూరంగా ఉన్న మాదిగ్గూడెంలోని డప్పు మట్టిగాని గుడిసె. ఊరోల్ల భయానికి గూడెపోల్లందరూ గూడెం ఇడ్సివెట్టి పారిపోంగ.. మిగిలిన గుడిసె అదొక్కటే. పుట్టి భూమ్మీద కాలు మోపిన కాన్నుంచి గీ గుడిసెల్నే బతుకీడ్సిన మట్టిగానికి యాభై ఏండ్లు దాటినయి. ఇయ్యాల పొద్దుగాల్నే.. నూరేండ్లు నిండినయి.
కాళ్ల కాన్నుంచి ముఖంపైదాంక దుప్పటి కప్పి.. ఒక నిట్టూర్పు ఇడ్సి, కండ్లు తుడ్సుకుంటా గుడిసె బైటికొచ్చిండు మట్టిగాని దోస్తు గోరేమియా. మట్టిగానికి గోరేమియా తప్ప నా అనేవాల్లెవ్వరూ లేరు. గోరేమియాది కూరగాయల యాపారమైతే, మట్టిగాడు పండగలకూ పబ్బాలకూ డప్పు కొట్టి.. వచ్చే డబ్బుల్తోనే కాలం ఎల్లదీసేటోడు. ఎప్పుడో ఓపాలి మందు తాగుడు అలవాటున్న మట్టిగానికి ఏమైందో ఏమో..
ఆర్నెల్లవట్టి ఇపరీతంగ తాగవట్టిండు. పది రోజుల కిందట కడుపు ఉబ్బుకొచ్చింది. గోరేమియా ఎంటవెట్కవొయి దవాఖానల
సూవెట్టిండు. కార్జెం చెడిపోయిందని, బతుకుడు కష్టమని చెప్పిండు డాక్టరు. మూడు రోజుల కిందట్నే కోమాలకు వొయిన మట్టిగాడు.. ఇయ్యాల తెల్లార్జామున పానమొదిలిండు. వానికి లగ్గం కాలే. శవం మీదవడి ఏడ్సేటోళ్లు లేరు. ఊర్లే అయినోళ్లు గని, కులపోళ్లు గని ఎవలూ లేరు.
‘మట్టిగాని శవం ఎట్టా లేవాలే?’ అనే ప్రశ్న.. గోరేమియా దిమాఖ్ల పెద్ద సవాలయి కూకుంది. అట్టా ఆలోచిస్తున్న గోరేమియా చూపులు, గుడిసెల మొండిగోడల మీదవడ్డయి.
‘నిజమో.. అబద్దమో గని.. కూలిన రాజుల కోట గోడలకు వీరగాథల చరిత్రలున్నట్లే.. దళిత వాడల్లో కూలిన గుడిసెల మొండిగోడలకు విషాద కథలుంటయ్యేమో!’ అనుకున్నడు గోరేమియా. సుమారు నలభై ఏండ్ల కిందట గూడెపోల్లకు జరిగిన అన్యాయం యాదికొచ్చింది.
గోరేమియాకు మట్టిగానితో దోస్తి కుదిరిన కొత్తలో, వానితో ఆడుకోనీకి మాదిగ్గూడేనికి వచ్చేటోడు. ఆ రోజుల్లనే గూడేనికి ఎక్కడినుంచో ఓ సాధు సన్నాసి వచ్చిండు. ఒంటరోడు కదా అనుకొని గూడెపోళ్లు చేరదీసింరు. గా సాధు సన్నాసి కూడా.. తనకు తెల్సిన చిట్కా వైద్యంతో గూడెపోల్లకు సేవలు చేస్తూ, వాళ్లకు దగ్గరయిండు. అట్టా కొన్నాళ్లు గడ్సినంక, ఆ సన్నాసి ఎవల్లకు చెప్పా పెట్టకుండా ఓ అద్దరాత్రి గూడెం వదిలి మాయమైండు. అతనెవరో? ఏడికెల్లి వచ్చిండో? ఏడికి వోయిండో? ఎవల్లకు తెల్వదు. అతను గూడెంలో ఉన్నన్నాళ్లు గూడెపోళ్లు గుండెల్ల వెట్కొని సూస్కున్నరు. గదే గూడెపోల్లకు శాపమై కూకుంది. గూడెపోళ్లు సాధు సన్నాసిని పిలిపించుకొని.. ‘చేతబడి’ నేర్చుకున్నరని ఊర్లే ఎవరో పుకారు లేవదీసింరు. అది ఊరంతా పాకింది. అప్పటికెల్లి.. ఊర్లే ఎవల్లకు సర్ది, జొరం వచ్చినా, బర్రె పాలియ్యకవొయినా.. గూడెపోల్ల చేతబడే కారణమని ఊరోల్లు గుంపులుగా గూడెమ్మీదవడెటోళ్లు. ఆళ్లను బూతులు తిట్టుకుంట.. ముసలోల్లు, ఆడోల్లు, పిల్లలని సూడకుండా, ఒకల్ల మీద ఒకల్లనేసి చావ బాదేటోళ్లు. ఇయ్యాల గాకున్నా, మరి కొన్నాళ్లకైనా తమకే పాపం తెల్వదనే నిజాన్ని ఊరోళ్లు తెల్సుకోక వోతరా.. అనుకొని బాధల్ని భరిస్తూ కాలం గడుపుతుంరు గూడెపోళ్లు.
గా బాధలట్టుండంగనే.. ఓ అమాస అద్దరాత్రి పండు ముసలి, గూడేనికి పెద్ద దిక్కయిన కాశయ్య తాత సచ్చిండు. అసలు.. గూడెంలో చేతబడి నేర్చుకోనీకి కారణమే కాశయ్య అని,
గా ముసలోని శవాన్ని ఊరి పొలిమేర్ల గూడ బొందవెట్టడానికి వీల్లేదని ఊరోళ్లు పట్టువట్టింరు. గూడెపోళ్లు ఓ అద్దరాత్రి కాశయ్య శవాన్ని తీస్కవొయి, ఊరికి రెండు మైళ్ల దూరంలో, ఎవ్వరూ ఎర్కవట్టని కాడ పారే
సొచ్చింరు. గూడెపోళ్లమీద ఊరోళ్లు వెడ్తున్న అనుమానపు హింసకు అంతులేకుండా వోయింది. గా నరకాన్ని భరించలేక, తమ బతుకులకు భరోసా ఉన్న ఊర్లకు వలసెల్లివొయింరు. వాళ్లల్లో కొందరికి మాన్యం భూములున్నప్పటికీ, ఆటిని ఏకాడికంటే ఆకాడికి బైనామాలు రాసిచ్చి ఎల్లి వొయింరు. మట్టిగానోల్ల గుడిసె ఒక్కటే గూడెంల మిగిలింది.
మట్టిగాని అయ్య.. కాటయ్య. ఊర్లే పంచాయతీ చాటింపులకు, శుభకార్యాలకు, పండుగలకు, చావులకు డప్పు వాయించేటోడు. అస్వంటోడొకడు ఊరికి అవుసరం కాబట్కి, కాటయ్యను ఊరొదిలి పోకుండా ఆపుకున్నరు ఊరోళ్లు. మట్టిగాని అమ్మ ఊర్లే యవసాయ కూలీ పనులల్లకు వోయేది.
అట్టా కాలం నెట్టుకొస్తున్న వాళ్లకు.. గుంటూరులో ఉన్న దూరపు సుట్టాల నుంచి కబురొచ్చింది. అక్కడ తోటలల్ల మిర్చి ఏర మనుషులు అవుసరముందని, ఒక నెల కష్టవడ్తే నాలుగు పైసలు ఎనకేసుకోవచ్చని. పదిహేనేండ్లు నిండిన మట్టిగాడు డప్పు వాయించడం బాగనే నేర్సుకున్నడు. వానికి మంచి శెబ్బర చెప్పి, వాడిని ఇంటికాన్నే ఇడ్సివెట్టి.. మొగుడు పెండ్లాలిద్దరు మిర్చి ఏరనీకి గుంటూరు వొయింరు.
పది దినాలు గడ్సినంక.. వాళ్ల ఆరోగ్యం చెడిందని, వాంతులు, విరేచనాలతో గవర్నమెంటు దవాకానల చేరినట్లు ఫోనొచ్చింది. మట్టిగాడు గుంటూరు దవాకానకు ఎల్లేటప్పటికే.. వాడి అయ్యా అమ్మ ఇద్దరూ సచ్చివొయింరని శవాల గదికి తీస్కవొయి సూపిచ్చింరు సిబ్బంది. శవాలు చెడిపోకముందే ఊరికి తీస్కపొమ్మని చెప్పింరు. కానీ, శవాల తీసుకెళ్లనీకి వానితాన డబ్బుల్లేవు. ఊర్లెకు తెచ్చినా.. సుట్టపోళ్లు లేరు. కులపోళ్లు లేరు. యాడ బొందవెట్టాల్నో ఎర్కలేదు. ఈ యవ్వారమంతా ఎట్టయితదో అర్థంకాక, ఏడ్సి ఏడ్సి ఆఖర్కి శవాలను దవాకానల్నే ఇడ్సివెట్టి.. ఎవల్లకు చెప్పకుండ ఏడ్సుకుంటా ఊరికి తిరిగొచ్చిండు. ఇది జరిగి శానేండ్లు గడ్సివోయింది. ఇప్పుడు ఊర్లే మాదిగ కులపోల్లే లేరు. వాళ్లు సచ్చిందీ లేదు.. బొందవెట్టిందీ లేదు. అంతకుముందు ఏం జరిగిందో
ఎవల్లకు తెల్వదు.
‘ఇప్పుడు మట్టిగాని శవం ఎట్టా లేవాలె?’..
ఎంత ఆలోచించినా గోరేమియా బుర్రకు అర్థమైతలేదు. ఊర్లే పెద్ద మనుషుల్ని అడిగితేనే ఓదారి దొరుకుద్దనుకొని.. సర్పంచుకు, మాజీ సర్పంచుకు, ఎంపీటీసీలకు, ఇంకొందరు పెద్ద
మనుషులకు ఫోన్జేసి చెప్పిండు.
వాళ్లు గూడ బాధవడి.. ‘గ్రామపంచాయితీ దగ్గరికి రా.. మాట్లాడ్దాం’ అన్నరు. కాళ్లల్ల తిర్గుతున్న మట్టిగాని కుక్కపిల్లను గుడిసె లోపట్కి తోలి.. బయటంగ బేడంవెట్టి, గ్రామపంచాయితీ కాడికొచ్చి కూకుండు గోరేమియా.
కొద్దిసేపయినంక సర్పంచ్ గొల్ల కిట్టన్న, మాజీ సర్పంచ్ ఎల్లారెడ్డి పటేల్, వార్డు మెంబరు సూరమ్మ, వాళ్ల ఎన్కంగనే ఎంపీటీసీ దూకుడు దుర్గయ్య, ఇంకొంతమంది పెద్ద మనుషులు వచ్చింరు. మాజీ సర్పంచ్ ఎల్లారెడ్డి పటేల్ అందరి వైపు ఓపాలి సూసి..
“మనం ఇప్పుడు ఇక్కడ కూడిన సంగతి అందరికీ ఎర్కయిందే. ఇయ్యాల మన డప్పు మట్టిగాడు సచ్చిపోయి.. మనూల్లే డప్పు కొట్టేటోడు లేకుండ జేసిండు. వాని కాలం తీరింది.. వాడు వోయిండు. ఇప్పుడు జరగాల్సింది మన చేతులల్ల ఉంది. వాడు సొంతోడంటూ ఎవ్వరూ లేని ఒంటరోడు. ఏంజేద్దాం? ఎట్టా జేద్దామంటరు?” అని చెప్పి, అక్కడున్నోల్లందరి వైపు సూసిండు. వాల్లెవరూ పెదాలిప్పలే.
‘ఎవల్లేం మాట్లాడ్తలేరు గదా!’ అనుకొని..
“ఇంగ నువ్వే చెప్పు గోరేమియా.. ఏం చేద్దమంటవ్?” అనడిగిండు ఎల్లారెడ్డి పటేల్.
“పెద్దోళ్లు.. అన్నీ ఎర్కయినోల్లు. మీరందరున్నంక నేను చెప్పేది ఏముంటది పటేల్ సాబ్! మట్టిగాడు మనూర్లనే పుట్టిండు. ఊరిని నమ్ముకొనే బతికిండు. ఈడనే సచ్చిండు. వాని శవాన్ని పాతివెట్టనీకీ, మన హిందువుల బొందలగడ్డల్నే జరంత సోటు సూపిస్తే వాన్నక్కడే బొందవెడ్దాం. గీ సంగతే చెబ్దామనీ.. మిమ్ములను కూడేసిన” అన్నడు గోరేమియా. ఆడ కూకున్నోల్లందరూ ఒకళ్ల మొకాల్లొకరు సూస్కున్నరు.
“నీ దగ్గర దాచేదేముంది గోరేమియా! జరిగిన సంగతి పొద్దుగాల్నే ఊర్లే అందరి చెవులల్ల ఏసిన. వాల్లేమన్నరంటే.. ‘ఎన్కటికెల్లి గూడ.. మాదిగల శవాలను హిందువుల బొందలగడ్డల బొంద వెట్టిన దాఖలాల్లేవు. ఇప్పుడు గూడ అదే పద్ధతిల నడ్సుకుంటెనే మంచిగుంటది’ అని అంటుంరు. ఏంజేద్దామంటవ్?” అన్నడు ఎల్లారెడ్డి పటేల్.
“అదేంది పటేలా అట్లంటరు? వాడు ఊర్లే శుభకార్యాలకు, ఊరుమ్మడి పండుగలకు, చావులకు, జాతర్లకు డప్పు కొట్టుకుంటనే బతికిండు. వాడు మాదిగ కులపోడనే గని.. హిందువే కదా! జాతర్ల దేవుని ఊరేగింపులో వాడు డప్పుకొడ్తే దేవునికి లేని అంటు.. బొందలగడ్డల మట్టికుంటదా! నాకెర్కలేక అడుగుతా? మట్టిగాడు మాతో కల్సి తిరిగేటోడెగని, ఏనాడైనా మాతో మసీదుకు వచ్చి నమాజు సద్విండా, చర్చిలల్లకు వోయి కిరిస్తాన్లల్ల కల్సిండా? వాడు అందరు హిందువుల్లాగనే బతికిండు. వాడు నూరుబాల్ల హిందువే పటేల! అందరూ మంచి మనసుతో జర ఆలోచించురి” అన్నడు గోరేమియా.
ఒక్కొక్కరూ ఒక్కో సలహా ఇచ్చింరు. మట్టిగాని శవాన్ని వాని గుడిసెల్నే పెట్టి దహనం జేయాలనీ, లేకుంటే వాని గుడిసెల్నే బొంద తవ్వి పూడ్సిపెడ్తే కిస్స ఖతమైతదనీ చెప్పింరు. కానీ, మట్టిగాన్ని గుడిసెల్నే దహనం చేయడం మహా పాపమని, ఆ పని వద్దన్నడు ఎల్లారెడ్డి పటేల్. ఇక గుడిసెల్నే పాతి పెట్టడమంటే.. సర్పంచ్ చెప్తెనే బాగుంటదని, సర్పంచ్ అభిప్రాయం చెప్పుమని అడిగిండు.
“లోతుగా ఆలోచిస్తే వాని గుడిసెల్నే బొందవెట్టుడు ఊరికి మంచిది కాదన్పిస్తుంది. ఎందుకంటే.. మనూరి పిల్లలు మాదిగ్గూడెం పక్క బాటలంగనే హైస్కూలు సదువులకు పక్కూరికి బోవాల. గతంలో మాదిగ్గూడెపోల్లకు చేతబడి వస్తదని పుకారు లేస్తే, గూడెపోల్లను సావగొట్టి తరిమేసిన చరిత్ర మనూరోల్లకుంది. ఇంగ ఇప్పుడు మట్టిగాని శవాన్ని వాని గుడిసెల్నె బొందవెడ్తే.. వాడు దెయ్యమై తిరుగుతుండని ఎవరైన పుకారు లేవదీస్తే.. ఆ బాటంగా పిలగాళ్లు బడికి వోతరా? నేనో మాట చెప్త ఇను ”.. అని గోరేమియా వైపు సూసిండు సర్పంచ్ కిట్టన్న.
“ఇంటన్నగని చెప్పే!” అన్నడు గోరేమియా.
“మన పక్కూరు సకినాలపల్లిలో మాదిగ కులపోళ్లు శానామంది ఉన్నరు. ఎట్టనో ఓగట్టా.. మట్టిగాని శవాన్ని గా ఊరికి తీస్కపోర్రి. ఈసారికి పని కానియ్యురి!” అన్నడు.
“అబ్బో.. మా గొప్పగ చెప్తివి కిట్టన్న. మక్కెలిరగ దన్నించుకునే సలహా మంచిగనే ఇస్తవ్ గద! ఒక ఊరి శవాన్ని, ఇంకో ఊరి పొలిమేర దాటచ్చి బొందవెడ్తే.. ఆ ఊరి జనం ఊకుంటరనుకుంటున్నవా? బడ్తెలు వట్టుకొని ఉరికించి కొడ్తరు ఎర్కేనా?” అన్నడు ఎల్లారెడ్డి పటేల్.
“ఓరెక్క అట్టనా? గా సంగతి నాకెర్కలే పటేల. ఇంగ ఏదో ఒకటి గోరేమియాకు మీరే చెప్పి పంపుర్రి!” అనిజెప్పి.. జేబులంగ సెల్ఫోన్ తీసి, ఎవరికో కలిపి మాట్లాడుకుంటా అక్కడంగ ఎల్లిపోయిండు సర్పంచ్ కిట్టన్న.
తమ సలహాలు పట్టించుకోలేదని, ముఖం మాడ్చుకొని అంతకుముందే ఎల్లివోయింరు ఎంపీటీసీ, ఇద్దరు ముగ్గురు పెద్దమనుషులు.
“సూస్తున్నవ్ గదా గోరేమియా! మనూరోళ్ల తమాషాలు. సరే పగటేలప్పుడు ఇంకోసారి అందర్నీ అడిగి సూద్దాం.. ఏమంటరో? వాల్లేమన్నది నీకు ఫోన్ జేసి చెప్త సరేనా! నూ గూడ ఇంటికి వోయి కాసింత తిను పో!” అని చెప్పి, ఎల్లారెడ్డి పటేల్ గూడ ఎల్లివోయిండు.
గోరేమియా ఒక్కడే మిగిలిండు. సమస్య మొదటికొచ్చింది. మట్టిగాడు యాదికొచ్చిండు. ఎప్పుడో తెల్లారగట్ట పానమొదిలిన మట్టిగాని శవాన్ని తానం చేపించడం ఆలిస్యమయి కుళ్లిపోతే? అట్టా కాకూడదు. ముందుగాల్నే వాడికి తానం చేపించాలే అనుకొని.. ఆడి నుంచి లేసి గూడెం బాటవట్టిండు గోరేమియా.
ఏదో ఆలోచించుకుంట మట్టిగాని గుడిసె కాడికొచ్చిండు గోరేమియా. తలుపు బేడెం తీసి లోపలికి వోయిండు. కట్టెలపొయి రాజేసి నీల్ల బిందె వెట్టిండు. నీళ్లు మంచిగ కాగినంక నులక మంచంమ్మీదున్న మట్టిగాని కాయాన్ని అట్టనే మంచం మీదుంచి, తానం జేపించిండు.
మట్టిగాడు కోమాలకు వోయినప్పుడు.. వాడు బతకడం కష్టమని డాక్టర్ చెప్పింది యాదుంచుకొని, వానికి తెల్వకుండనే వాని శవ సంస్కారానికి కావల్సినయి అన్ని తెచ్చివెట్టిండు గోరేమియా. అందులంగనే కొత్త పొడిగుడ్డ తీసి సుబ్బరంగ తుడిసి, కొత్త బట్టసుట్టి కింద సాప మీద పడుకోవెట్టిండు. నుదుట పెద్ద కుంకుమ బొట్టు దిద్దిండు. రోజ్ వాటర్ సల్లిండు. పూలదండ మెడలేసిండు. పెండ్లిగాని మట్టిగాన్ని పెండ్లికొడుకులా తయారుజేసిండు. గుడిసె సూరులంగా, సర్వేబార్లు గడెబొంగులు గుంజి పాడె తయారుజేసిండు. లేసి నిలబడి ఊపిరి పీల్చుకున్నడు గోరేమియా.
తిరిగి పాత ప్రశ్నలే పీకుతున్నయి దిమాక్ల. ‘పాడె మోస్కపోయేదెవలు? పాతివెట్టేదెక్కడ?’..
ఎల్లారెడ్డి పటేల్కు ఫోన్ కలిపిండు. ‘స్విచ్చాఫ్’ వచ్చింది. ఇంకొందరికి కలిపితె.. ఫోన్ ఎత్తలేదు. అర్థమైంది గోరేమియాకు. ‘గిదేం ఊరు? ఈల్లేం మనుషులు?’ అనుకున్నడు. ఏం తోస్తలేదు. గుడిసెలంగ బయటికొచ్చిండు. ‘ఇంటికివోయి తానం జెయ్యాల.. ముందుగాల!’ అనుకున్నడు. బయటంగ బేడం వెట్టి ఇంటికొచ్చిండు గోరేమియా. నీరసంగ కూకున్న భర్తను సూసి..“ఊర్లే పెద్ద మనుషుల్ని అడిగినవా? ఏమన్నరు?” అన్నది గోరేమియా భార్య ఖతీజ.
“హిందువుల బొందలగడ్డల మాదిగోల్ల శవాలను బొందవెట్టే ఆచారం లేదంట. ఊరోల్లెవరూ ఒప్పుకుంటలేరు..” అన్నడు గోరేమియా.
భర్త మాటలల్ల బాధను కనిపెట్టింది ఖతీజ.
మట్టిగాడు గుంటూరు దవాకానకు ఎల్లేటప్పటికే.. వాడి అయ్యా అమ్మ ఇద్దరూ సచ్చివొయింరని శవాల గదికి తీస్కవొయి సూపిచ్చింరు సిబ్బంది. శవాలు చెడిపోకముందే ఊరికి తీస్కపొమ్మని చెప్పింరు. కానీ, శవాల తీసుకెళ్లనీకి వానితాన డబ్బుల్లేవు.
“బాధపడకు. నీ గుబులు అర్థమైతుందిగని.. ఇంత పెద్ద ఊర్లే.. మట్టన్న శవాన్ని బొందవెట్టనీకి సోటే దొర్కదా ఏంది?” అన్నది.
“ఖాళీ సోటు యాడుంది? ఊరి సుట్టూ రైతుల పట్టా భూములేనాయే! ఎవరి భూమిల బొందవెడ్తే ఎవరూకుంటరు చెప్పు?” అన్నడు గోరేమియా ముఖం యాలాడేసి.
“ఎవల్ల భూమిల ఎందుకు పాతివెట్టాలే! వాల్లందరికున్నట్లే.. మనక్కూడ రెండెకరాల చెలక ఉంది కదా! ఆన్నే బొందవెట్టు. మట్టన్న దెయ్యమై పీక్కు తింటడా? తింటే తిన్నీ. అందరం ఏదో ఒకరోజు పోయేటోల్లమే కదా!” అన్నది ఖతీజ. భార్య సలహాతో గోరేమియాకు ధైర్యమొచ్చింది. మల్లంతల్నే ముఖం పాలివోయింది. “నూ చెప్పింది బాగనే ఉందిగని.. మన చెలక ఊరికి కిలోమీటర్ దూరంల ఉంటది. అంత దూరం తీస్కబోవుడెట్టా?” అన్నడు.
“ఎవల్లనన్నా అడిగి సూడు. వత్తరేమో!”.
“అడిగి సూసిన. మందు వోయిస్త, డబ్బులిస్తనన్న.. ఏమన్నరో ఎర్కనా! ‘మాదిగోని శవాన్ని మోయ.. మంచి ముత్యాలిచ్చినా ఎవల్లు రారు’ అన్నరు. నాకు చాలా బాధేసింది ఖతీజ. ఈల్లేం మనుషులో? ఏం నమ్మకాలో? పట్టణాలు, నగరాలే కాస్త నయం ఇస్వంటి ఇషయాల్ల.. ఏ పట్టింపులుండవు. పల్లెటూర్లల్నే గీ అర్థం పర్థం లేని పట్టింపులు. ఏం జెయ్యాల్నో తోస్తలేదు ఖతీజ” అన్నడు దిగాలుగా ఆమె వైపే చూస్తూ.
మట్టయ్య పాడెను తమ చెల్కదాంక ఎట్ట తీస్కబోవాలో ఇవరంగ చెప్పింది ఖతీజ.
భార్య చెప్పింది ఇన్నంక.. రాత్రికెల్లి మోస్తున్న బరువేదో దిగివోయినట్లయింది. కొత్త హుషారొచ్చింది గోరేమియాకు. భార్య ఖతీజకు చాయ్ వోయమని చెప్పి, పలుగు, పార టెంకె సర్దుకున్నడు. ఇంతల్నే భార్య చాయ్ తెచ్చిస్తే తాగిండు. గోరేమియాకు టీవీఎస్ బండి ఉంది. బొంద తవ్వనీకి సర్దుకున్న పనిముట్లను మోపెడ్ పైన వెట్టుకొని చెల్క కాడికి వోయిండు.
బొందను తవ్వేటప్పుడే వెడల్పుగా మెట్లుగా చెక్కిండు. పాడెకు బండికి కట్టిన తాళ్లు ఇప్పి, మట్టిగాని కాయాన్ని చేతులల్ల అడ్డంగా ఎత్తుకొని మెల్లిగ బొందలోనికి దింపిండు. ఆఖరిసారిగా దోస్తు ముఖం సూసిండు. గోరేమియా కండ్లల్ల రెండు కన్నీటి బొట్లు మట్టిగాని ముఖం మీదవడ్డయి.
సయ్యద్ గఫార్
సయ్యద్ గఫార్ స్వస్థలం నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వాడపల్లి. ప్రస్తుతం హైదరాబాద్లో నివాసం ఉంటున్నారు. ‘పంచాయతీ రాజ్ లీడర్’ స్థానిక సంస్థల విశ్లేషణ మాస పత్రికను ఎనిమిదేళ్లు నడిపించారు. స్టేజీ నాటకాల్లో నటన, దర్శకత్వ బాధ్యతలు నిర్వహించారు. 1973 నుంచీ రచనా వ్యాసంగంలో ఉన్నారు. ఈయన రాసిన మొదటి కథ.. ‘పాపం పండిన రాత్రి’. 2018లో ‘జనన వాంగ్మూలం’ కవితా సంపుటిని వెలువరించారు. నమస్తే తెలంగాణ – ముల్కనూరు ప్రజా గ్రంథాలయం నిర్వహించిన కథల పోటీల్లో.. ఖుర్బానీ (2020), నషా (2021), ఉల్టాబాజా (2022) కథలకు ప్రత్యేక బహుమతులు దక్కించుకున్నారు. ‘మౌనధ్వని’ నాటిక, ‘హంస’ కథలకు బహుమతులు అందుకున్నారు.
ఖతీజ వేడి నీళ్లు తోడి వెడ్తే తానం జేసిండు. పాత ట్రంకు పెట్టలంగ తన పెండ్లికి కుట్టించుకున్న బులుగు రంగు షేర్వానీ పైజామా తీసి తొడుక్కున్నడు. ఎర్రటి పున్నా టోపీ పెట్టుకున్నడు. దుమ్ము పట్టిన బూట్లను దులిపి తొడుక్కుని నవాబు లెక్క తయారైండు. అప్పటికే తాము కూరగాయలమ్మే నాలుగ్గీరల బండిని సుబ్బరంగ కడిగి, పూలదండలు కట్టి సింగారించి వెట్టింది ఖతీజ. పది బార్ల ప్లాస్టిక్ తాడు, క్యాన్ల నీళ్లు నింపి బండి మీద వెట్టి గోరేమియాతో బండి తీస్కవొమ్మని చెప్పింది.
గోరేమియా బండి నెట్టుకుంటా మట్టిగాని గుడిసెకాడికొచ్చి బేడం దీసిండు. ముందుగాల్నే తయారుజేసి పెట్టిన పాడెను పట్టుకొచ్చి నాలుగ్గీరల బండి మీదవెట్టిండు. నౌశి అలకంగా ఉన్న మట్టిగాని కాయాన్ని ఎత్తుకొచ్చి పాడెమీద పడుకోవెట్టిండు. ఎత్తుపల్లాల్లో పాడె పడిపోకుండా తాళ్లతో కట్టిండు. గుడిసె లోపటంగ జమ్ము పీకి మంటవెట్టిండు. మట్టిగాని డప్పు పట్కొచ్చి.. ‘ఖణ్ ఖణ్’ అని మోగేటట్టు కాపిండు. చిడతలు దీస్కున్నడు. కుక్కపిల్లను బయటికి తోలి గుడిసె బయటంగ బేడం వెట్టిండు. భార్య ఖతీజ ఇచ్చిన ప్లాస్టిక్ తాడును ఒక కొసను బండికి కట్టి, మరో కొసను తన నడుముకు కట్టుకున్నడు. ఎనకంగ కుక్కపిల్ల నడుస్తుంటే, మట్టిగాని దోస్తీల నేర్చుకున్న.. ‘ఉల్టాబాజా’ వాయించుకుంట నడి ఊర్లంగ మట్టిగాని శవయాత్ర దీసిండు. గోరేమియా వాళ్ల చెలకకు బోవాలంటే ఊర్లంగనే బోవాలె. ఏరే బాట లేదు. షేర్వానీ పైజామా, నెత్తిన ఎర్రని పున్నావాలా రూమీ టోపి, కాళ్లకు మహారాజా బూట్లేసుకొని.. మట్టిగాని శవమున్న నాలుగ్గీరల బండిని నడుముకు కట్టుకొని ఊరేగింపుగా తీస్కవోతున్న గోరేమియాను సిత్రంగ సూస్తుంరు ఊర్లే జనం. కొందరు భయపడి లోపటంగ తలుపులేస్కొని తలుపు సందులల్లంగ సూడవట్టింరు. ఆల్లను గమనిస్తూనే అట్టా ఊరి బయటిదాంక వచ్చి, నడుముకు బండికి కట్టిన తాడు ఇప్పి, బండిని నెట్టుకుంటా తమ చెలక కాడికొచ్చిండు.
బట్టలిప్పి లుంగీ కట్టుకున్నడు. బొందను తవ్వేటప్పుడే వెడల్పుగా మెట్లుగా చెక్కిండు. పాడెకు బండికి కట్టిన తాళ్లు ఇప్పి, మట్టిగాని కాయాన్ని చేతులల్ల అడ్డంగా ఎత్తుకొని మెల్లిగ బొందలోనికి దింపిండు. ఆఖరిసారిగా దోస్తు ముఖం సూసిండు. గోరేమియా కండ్లల్ల రెండు కన్నీటి బొట్లు మట్టిగాని ముఖం మీదవడ్డయి. ఇంకా పొంగి వస్తున్న దుఃఖాన్ని ఆపుకొంటా.. మట్టిగాని ముఖం మీద బట్ట కప్పి కట్టేసిండు. వాడు బతికినన్నాల్లు ఆధారం చేసుకొని బతికిన డప్పును, చిడతల్ని వాని తల పక్కనేవెట్టి, ముందుగాల దోశిల్లతోని మట్టిపెడ్డలేసిండు. అటెన్క పారతో మట్టి లాగి బొంద పూడ్సిండు. క్యాన్ల తెచ్చిన నీళ్లతో బొందను అలికిండు.
కాళ్లు, చేతులు, ముఖం కడుక్కొని.. లుంగి ఇప్పి బట్టలేస్కుండు. టోపి వెట్టుకుండు. ఆకాశంకెల్లి రెండు దోశిల్లు సాచి, తల పైకెత్తి..
‘యా అల్లాహ్! నా దోస్తు.. ఏ కులపోడో, ఏ మతపోడో నీకెర్కే! వాడు అందరిలాగే పుట్టిండు. బతికినన్నాల్లు పది మందికోసమే బతికిండు. తెలిసీ తెలియక వాడు ఏవైనా తప్పులు చేసి ఉంటే మాఫ్ జెయి.. నా దోస్తు ఉత్త అమాయకుడు. వానికి జన్నత్ ప్రాప్తింపజెయ్యి” అని ప్రార్థించుకొని.. రెండు అరిచేతులను ముఖం పైన తిప్పుకున్నడు.
అక్కడినుంచి కదిలి తిరిగి బండి నెట్టుకుంటూ.. భారమైన మనసుతో ఇంటి దారివట్టిండు. పది అడుగులు ఏసినంక ఏదో మరిచినట్లు అనిపించి ఎనక్కి తిరిగి సూసిండు.
మట్టిగాని కుక్కపిల్ల వాని బొందకాన్నే కూకొని.. ‘కుంయ్.. కుంయ్..’ అంటున్నది. దానినట్లా సూడంగనే గోరేమియా కండ్లు చెమర్చినయి. దాని దగ్గరికి వోయి.. దాన్నెత్తుకొచ్చి బండిమీద కూకోవెట్టుకొని బండి నెట్టుకుంట ఊరి బాట వట్టిండు. కుక్కపిల్ల మట్టిగాని బొంద కనుమరుగయ్యేంతవరకు అటువైపు సూస్తూనే ఉంది. ‘ఈ జాతికున్నంత ఇస్వాసంలో ఈసమెత్తయినా మనిషిజాతికుంటే ఎంత బాగుండు!’ అనుకుంట ఊళ్లెకొచ్చిండు.
ఊళ్లె ఎదురువడ్డ ప్రతి మనిషి గోరేమియాను సూసి భయంతోనో, సిగ్గుతోనో.. తలలు దించుకొని వోతుంరు. గోరేమియా ఒక్కడే మనిషిలా తలెత్తుకొని తమ ఇంటి వైపు అడుగులేసుకుంటూ…!
జన్నత్ – స్వర్గం
దోజఖ్ – నరకం
ఉల్టాబాజా – తిరగల డప్పు, చావు డప్పు.
– సయ్యద్ గఫార్, 81432 53116