HomeSportsWomens Premier League To Begin On March 4
మార్చి 4 నుంచి డబ్ల్యూపీఎల్
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) అరంగేట్రం సీజన్కు రంగం సిద్ధమైంది. ముంబై వేదికగా మార్చి 4 నుంచి 26 వరకు డబ్ల్యూపీఎల్ తొలి సీజన్ జరుగనుంది.
న్యూఢిల్లీ: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) అరంగేట్రం సీజన్కు రంగం సిద్ధమైంది. ముంబై వేదికగా మార్చి 4 నుంచి 26 వరకు డబ్ల్యూపీఎల్ తొలి సీజన్ జరుగనుంది. గుజరాత్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్తో సీజన్కు తెరలేవనుంది. ఈ విషయాన్ని ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నాడు.
‘మహిళల ఐపీఎల్ లీగ్కు ముంబైలోని బ్రబౌర్న్, డీవై పాటిల్ స్టేడియాలు ఆతిథ్యమిస్తాయి.ఈ నెల 13న మహిళల ఐపీఎల్ వేలం పాట జరుగుతుంది. దీనికి కోసం ఇప్పటికే దాదాపు 1500మంది ప్లేయర్లు దరఖాస్తు చేసుకున్నారు. ఈ అరంగేట్రం సీజన్లో మొత్తం 22 మ్యాచ్లు జరుగుతాయి’ అని అన్నాడు. పాయింట్ల పట్టికలో టాప్లో నిలిచిన టీమ్ నేరుగా ఫైనల్స్కు అర్హత సాధిస్తుంది.