శ్రీనగర్ : పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ఖాన్కు భారతదేశం ప్రధాని నరేంద్ర మోదీ లేఖ రాయడం పట్ల పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) చీఫ్ మెహబూబా ముఫ్తీ సంతోషం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ లేఖ సరైన దిశలో ఒక అడుగు అని ఆమె అభిప్రాయపడ్డారు. ఇరుదేశాల మధ్య సంభాషణలు, సయోధ్య ప్రక్రియకు ఈ లేఖ దారితీస్తుందని మెహబూబా ముఫ్తీ ఆశాభావం వ్యక్తం చేశారు.
‘ప్రధాని మోదీ తన పాకిస్తాన్ ప్రధానిని చేరుకోవడానికి సరైన దిశలో ఒక అడుగు వేశారు. వాజ్పేయిజీ ప్రముఖంగా చెప్పినట్లు.. ఒకరు తన స్నేహితులను మార్చగలరు.. కానీ, పొరుగువారిని కాదు. ఇది ఇరు దేశాల మధ్య సంభాషణ, సయోధ్య ప్రక్రియకు దారితీస్తుందని నమ్ముతున్నాను. కశ్మీర్కు వైద్యం అవసరం’ అని మెహబూబా ముఫ్తీ బుధవారం ఒక ట్వీట్లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్కు మోదీ రాసిన లేఖ ప్రతి ఫొటోను షేర్ చేశారు.
పాకిస్తాన్ దేశం స్వాతంత్రదినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం, 23 వ తేదీన, పాక్ ప్రధానికి, దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ భారతదేశం ప్రధాని మోదీ లేఖ రాశారు. పొరుగు దేశంగా.. పాకిస్తాన్ ప్రజలతో స్నేహపూర్వక సంబంధాలను భారత్ కోరుకుంటుంది. ఇందుకోసం భీభత్సం, శత్రుత్వం లేని విశ్వసనీయ వాతావరణం అత్యవసరం అని ప్రధాని మోడీ తన లేఖలో పేర్కొన్నారు.
ఆందోళన కలిగిస్తున్న కొవిడ్ ఆర్-ఫ్యాక్టర్
బెంగాల్ ఎన్నికలకు యూపీ పోలీసులు.. ఈసీకి టీఎంసీ లేఖ
బిట్ కాయిన్తో టెస్లా కారు కొనొచ్చు.. ఎలోన్ మస్క్ ట్వీట్
త్వరలో క్యాన్సర్ వ్యాధికి టీకా.. జర్మన్ శాస్త్రవేత్త దంపతుల దృష్టి
పరంబీర్ పిటిషన్ విచారణకు నిరాకరించిన సుప్రీంకోర్టు
క్షయవ్యాధికి కారకాన్ని గుర్తించిన రాబర్ట్ కోచ్.. చరిత్రలో ఈరోజు
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.