హైదరాబాద్, ఆట ప్రతినిధి: దేశవాళీ ప్రతిష్ఠాత్మక టోర్నీ రంజీ ట్రోఫీ తొలి పోరులో హైదరాబాద్ జట్టు.. తమిళనాడుతో తలపడనుంది. ఎలైట్ గ్రూప్-‘బి’లో భాగంగా మంగళవారం నుంచి ఉప్పల్ రాజీవ్గాంధీ అంతర్జాతీయ స్టేడియం వేదికగా ప్రారంభం కానున్న మ్యాచ్లో పటిష్ట తమిళనాడుతో హైదరాబాద్ తలపడనుంది. స్టార్ ఆటగాళ్లు సిరాజ్, తిలక్ వర్మ జాతీయ విధుల్లో బిజీగా ఉండగా.. తన్మయ్ అగర్వాల్ జట్టుకు సారథ్యం వహిస్తున్నాడు.
మరోవైపు బాబా ఇంద్రజిత్, అపరాజిత్, విజయ్ శంకర్తో తమిళనాడు జట్టు బలంగా కనిపిస్తున్నది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 20 వరకు జరిగే ఈ టోర్నీలో మొత్తం 32 జట్లు నాలుగు గ్రూప్లుగా బరిలోకి దిగనున్నాయి. ప్రతి గ్రూప్ నుంచి రెండు జట్లు నాకౌట్కు అర్హత సాధించనున్నాయి. అజింక్యా రహానే, ఇషాంత్ శర్మ, పృథ్వీ షా, యశస్వి జైస్వాల్ వంటి వాళ్లు ఈ సీజన్లో పరుగుల వరద పారించి టీమ్ఇండియాలో చోటు దక్కించుకునే ప్రయత్నాల్లో ఉన్నారు.