కావ్లూన్(హాంకాంగ్): హాంకాంగ్ బ్యాడ్మింటన్ ఓపెన్లో భారత షట్లర్ల పోరు ముగిసింది. గురువారం జరిగిన మహిళల డబుల్స్ పోరులో గాయత్రీ గోపీచంద్, త్రిసాజాలీ ద్వయం 8-21, 14-21 తేడాతో అప్రియాణి రహయు, సితి ఫాదియా సిల్వా జోడీ(ఇండోనేషియా) చేతిలో ఓటమిపాలైంది. మరో డబుల్స్లో తనీషా క్రాస్టో, అశ్విని పొనప్ప జోడీ 18-21, 7-21తో మత్సుమోటో, నగహర జంట చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది.