Jivanji Deepthi | హైదరాబాద్, ఆట ప్రతినిధి: బెంగళూరు వేదికగా జరుగుతున్న 6వ పారా అథ్లెటిక్స్ ఇంటర్నేషనల్ చాంపియన్షిప్లో తెలంగాణ యువ అథ్లెట్ జివాంజీ దీప్తి పసిడి పతకంతో మెరిసింది. సోమవారం జరిగిన మహిళల 400మీటర్ల టీ20 రేసును 55.49సెకన్లలో ముగించి అగ్రస్థానంలో నిలిచింది. దీప్తికి ఇది వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శన. ఇదే రేసులో పోటీపడ్డ జయంతి బెహెర(ఒడిశా), భువి అగర్వాల్(హర్యానా) వరుసగా రజత, కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారు. పురుషుల డిస్కస్త్రో ఎఫ్37 విభాగం రవికిరణ్ కాంస్య పతకం దక్కించుకున్నాడు.