దుబాయ్: ఆసియాకప్ టోర్నీ సందర్భంగా ఒక ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఈ నెల 4న భారత్-పాకిస్థాన్ మ్యాచ్ సందర్భంగా పాక్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది చిన్న కూతురు భారత జాతీయ పతాకాన్ని రెపరెపలాడించడం పలువురిని ఆశ్చర్యపరిచింది.
ఈ సంఘటనపై అఫ్రిది వివరణ ఇస్తూ స్టేడియంలో తొంభై శాతం ప్రేక్షకులు భారతీయులేనని, తన కూతురుకు పాకిస్థాన్ జెండా లభించకపోవడంతో పక్కనున్న వారి నుంచి భారత జెండాను తీసుకున్నదని, జెండాల మధ్య వ్యత్యాసం తెలియని అమాయకత్వమే ఇందుకు కారణమని అన్నాడు. అంతేగాని ఇందులో వేరే ఉద్దేశాలు ఏమీ లేవన్నాడు.