మెల్బోర్న్: గతంలో రెండు సార్లు ఆస్ట్రేలియన్ ఓపెన్ డబుల్స్ గెలిచిన సానియా మీర్జా.. ఆస్ట్రేలియన్ ఓపెన్లో తన చివరి మ్యాడ్ ఆడేసింది. ఇవాళ జరిగిన మిక్స్డ్ డబుల్స్లో సానియా జంట ఓటమిపాలైంది. క్వార్టర్స్ ఫైనల్లో సానియా, రాజీవ్ రామ్ జోడి.. 4-6, 6-7 స్కోర్తో ఆస్ట్రేలియాకు చెందిన జేమీ ఫౌరిల్స్-జేసన్ కుబ్లర్ జంట చేతిలో అనూహ్య పరాజయాన్ని చవిచూసింది. నిజానికి సానియా జంట రెండు సెట్లలోనూ గట్టి పోటీ ఇచ్చినా.. ఆస్ట్రేలియన్ జంట ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఈ ఓటమితో ఇక సానియా ఆస్ట్రేలియన్ ఓపెన్కు దూరం అయినట్లే. ఈ ఏడాది తన చివరి సీజన్ ఆడుతున్నట్లు ఇటీవల సానియా మీర్జా ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ప్రొఫెషనల్ టెన్నిస్ నుంచి రిటైర్మెంట్ తీసుకోనున్నట్లు ఆమె వెల్లడించింది.