ముంబై: ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) కొత్తగా తీసుకొస్తున్న ‘హండ్రెడ్’ టోర్నీలో భారత క్రికెటర్ల ప్రాతినిధ్యం అంతకంతకూ పెరుగుతూనే ఉన్నది. ఈ టోర్నీలో ఇప్పటికే హర్మన్ప్రీత్కౌర్, స్మృతి మందన, షెఫాలీ వర్మ, దీప్తి శర్మ బరిలోకి దిగుతుండగా, తాజాగా జెమీమా రోడ్రిగ్స్ ఇందులో చేరింది. జూలై 21 నుంచి మొదలుకాబోతున్న హండ్రెడ్ టోర్నీలో నార్తర్న్ సూపర్చార్జర్స్ తరుఫున రోడ్రిగ్స్ ఆడనుంది.