Irfan Pathan : టెస్టు జట్టు ఎంపికకు రంజీ ట్రోఫీ మొదటి ఆప్షన్ కావాలని టీమిండియా మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ అన్నాడు. ఆటగాళ్లను టెస్టుల్లోకి తీసుకునే ముందు రంజీ ట్రోఫీలో వాళ్ల ప్రదర్శనను పరిగణనలోకి తీసుకోవాలని అతను అభిప్రాయపడ్డాడు. ఆస్ట్రేలియాతో తొలి రెండు టెస్టులకు భారత జట్టును బీసీసీఐ శుక్రవారం ప్రకటించింది. 17మందితో ఆటగాళ్లను సెలక్ట్ చేసింది. ఆ లిస్టులో రంజీల్లో భారీ స్కోర్లు నమోదు చేస్తున్న ముంబై ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్కు చోటు దక్కకపోవడంతో ఇర్ఫాన్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. రంజీల్లో అతను వరుసగా 2020-21, 2021-22 సీజన్లలో వరసగా 928. 982 పరుగులు సాధించాడు. ప్రస్తుతం కొనసాగుతున్న రంజీ టోర్నమెంట్లో సర్ఫరాజ్ ఇప్పటికే 431 రన్స్ చేశాడు.
న్యూజిలాండ్, బంగ్లాదేశ్, శ్రీలంకతో టీ20 సిరీస్లో అదరగొట్టిన వరల్డ్ నంబర్ 1 బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ తొలిసారి టెస్టు జట్టుకు ఎంపికయ్యాడు. రిషభ్ పంత్ ప్లేస్లో బంగ్లాపై డబుల్ సెంచరీ బాదిన్ ఇషాన్ కిషన్ సెలక్ట్ అయ్యాడు. భారత పర్యటనలో ఆస్ట్రేలియా బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో నాలుగు టెస్టులు ఆడనుంది. ఇరుజట్లు ఫిబ్రవరి 9న నాగ్పూర్లో జరిగే తొలి టెస్టులో తలపడనున్నాయి.
Ranji trophy performances should be the first criteria for test selections!
— Irfan Pathan (@IrfanPathan) January 14, 2023