పంజాబ్తో జరిగిన మ్యాచ్లో లక్నో బౌలర్లు సమిష్టిగా రాణించారు. దీంతో 154 పరుగుల టార్గెట్ను కాపాడుకున్న లక్నో సూపర్ జెయింట్స్.. తమ ఖాతాలో మరో విజయాన్ని చేర్చుకుంది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన లక్నో జట్టు.. ఒకరిద్దరు మినహా మిగతా బ్యాటర్లు చేతులెత్తేయడంతో భారీ స్కోరు చేయలేకపోయింది.
చివర్లో బౌలర్లు కూడా బ్యాటు ఝుళిపించడంతో 8 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో పంజాబ్కు సరైన ఆరంభం దక్కలేదు. కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (25) ఫర్వాలేదనిపించినా.. ధవన్ (6) పూర్తిగా నిరాశపరిచాడు. ఆ తర్వాత వచ్చిన రాజపక్స (9) కూడా విఫలమయ్యాడు.
కాసేపు మెరుపులు మెరిపించిన లియామ్ లివింగ్స్టన్ (18) కూడా అవుటవడంతో పంజాబ్ ఓటమి దాదాపు ఖాయమైంది. అయితే అప్పటికి బెయిర్స్టో (32) క్రీజులో ఉండటంతో గెలుపుపై కొద్దొగొప్పో ఆశలు మిగిలాయి పంజాబ్కు. చమీర బౌలింగ్లో అతను కూడా అవుటయ్యాడు.
జితేష్ శర్మ (2), రబాడ (2), రాహుల్ చాహర్ (4) బ్యాటుతో ఏమీ సాధించలేకపోయారు. చివర్లో రిషి ధావన్ (21 నాటౌట్) పోరాడినా ఫలితం దక్కలేదు. దీంతో నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ జట్టు 8 వికెట్ల నష్టానికి 133 పరుగులు మాత్రమే చేయగలిగింది. లక్నో బౌలర్లలో మొహ్సిన్ ఖాన్ 3, చమీర 2, కృనాల్ పాండ్య 2, రవి బిష్ణోయి ఒక వికెట్ తీసుకున్నారు.
That's that from Match 42.@LucknowIPL win by 20 runs and add two more points to their tally.
Scorecard – https://t.co/H9HyjJPgvV #PBKSvLSG #TATAIPL pic.twitter.com/dfSJXzHcfG
— IndianPremierLeague (@IPL) April 29, 2022