Mitchell Marsh: కొద్దిరోజుల క్రితమే భారత్ వేదికగా ముగిసిన వన్డే ప్రపంచకప్ ఫైనల్లో టీమిండియాను ఓడించిన ఆస్ట్రేలియా ఆరోసారి ట్రోఫీ నెగ్గిన విషయం తెలిసిందే. ట్రోఫీ గెలిచిన తర్వాత ఆసీస్ ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్.. వరల్డ్ కప్ ట్రోఫీపై కాళ్లు పెట్టిన ఫోటో నెట్టింట వైరల్ అయింది. మార్ష్ చేసిన ఈ పనిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ప్రపంచంలోని అత్యుత్తమ స్థాయిలో పది జట్లు పోటీపడే ఈ ట్రోఫీని నెత్తిన పెట్టుకోవాల్సింది పోయి దానిపై కాళ్లు పెట్టడాన్ని క్రికెట్ ఫ్యాన్స్తో పాటు క్రికెటర్లు, విశ్లేషకులు కూడా తప్పుబట్టారు. ఇన్నాళ్లు దీనిపై కామ్గా ఉన్న మార్ష్.. తాజాగా స్పందించాడు.
ఆస్ట్రేలియాకు చెందిన సెన్ రేడియో నెట్వర్క్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మార్ష్ మాట్లాడుతూ… ఆ ఫోటోలో ఎలాంటి అగౌరవం లేదు. నేను దాని గురించి అధికంగా ఆలోచించలేదు. సోషల్ మీడియాను అధికంగా చూడను.. అయినా అందులో నాకైతే ఎలాంటి తప్పూ కనిపించడం లేదు.. అని చెప్పిన మార్ష్ వరల్డ్ కప్ ట్రోఫీపై మళ్లీ అలా చేయడానికి తనకేం అభ్యంతరం లేదని వ్యాఖ్యానించడం గమనార్హం.
Mitchell Marsh said, “there was no disrespect meant in that photo. I haven’t given it too much thought. There’s nothing in that”. (SEN Radio). pic.twitter.com/z1oip5fnvD
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 1, 2023
మార్ష్ గతంలో చేసిన ఈ పనికి భారత క్రికెటర్ మహ్మద్ షమీ కూడా అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. మార్ష్ అలా చేయడం తనను చాలా బాధించిందని అన్నాడు. భారత్కే చెందిన ఓ అభిమాని అయితే దీనిపై కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖకు లేఖ రాస్తూ మార్ష్ ను క్రికెట్ నుంచి నిషేధించాలని కోరాడు.