Match Fixing | ఓ వైపు ఇండియన్ ప్రీమియర్ లీగ్-2023 రసవత్తరంగా సాగుతున్నది. ఆయా జట్ల మధ్య మ్యాచ్లు ఆద్యాంతం ఉత్కంఠగా సాగుతున్నాయి. మరోవైపు బెట్టింగ్లుసైతం జోరుగా సాగుతున్నాయి. ఈ సమయంలో మ్యాచ్ ఫిక్సింగ్ వ్యవహారం ఒక్కసారిగా కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ వ్యక్తి భారత్ – ఆస్ట్రేలియా వన్డేలో ఫిక్సింగ్కు ప్రయత్నించాడు. ఇందు కోసం హైదరాబాదీ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ను ఆశ్రయించాడు. తాను బెట్టింగ్లో డబ్బు పోగొట్టుకున్నానని, టీమ్ అంతర్గత సమాచారం ఇచ్చి ఆదుకోవాలని బౌలర్ను సదరు వ్యక్తి వేడుకున్నాడు.
ఈ సిరాజ్కు వాట్సాప్ సందేశాలు పంపాడు. దాంతో ఈ విషయాన్ని సిరాజ్ వెంటనే విషయాన్ని బీసీసీఐకి దృష్టికి తీసుకువెళ్లాడు. ఈ క్రమంలోనే తాజాగా సదరు వ్యక్తిని బీసీసీఐ లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అయితే, సదరు వ్యక్తి బుకీ కాదని, మ్యాచ్ బెట్టింగ్లకు బానిసైన హైదరాబాద్కు చెందిన డ్రైవర్గా గుర్తించారు. అతనికి గ్యాంగ్తో సంబంధాలు లేవని తేలింది. ప్రస్తుతం సదరు వ్యక్తి ఆంధ్రప్రదేశ్ పోలీసుల అదుపులో ఉన్నాడు.
కాగా, గత నెల 19న వైజాగ్లో భారత్ – ఆస్ట్రేలియా మధ్య వన్డే మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. భారత్లో ఆస్ట్రేలియా ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో పర్యటించిన విషయం తెలిసిందే. ఇందులో నాలుగు టెస్టులు, మూడు వన్డే మ్యాచ్లు, టీ20 సిరీస్లు ఆడింది. 2013 స్పాట్ ఫిక్సింగ్ ఉదందం నుంచి బీసీసీఐ ఈ వ్యవహారంపై కఠినంగా వ్యవహరిస్తున్నది. ఇందులో భాగంగా ఆటగాళ్లందరికీ వర్క్ షాప్స్ సైతం నిర్వహించింది. ఆయా సందర్భాల్లో ఏం చేయాలో అందరికీ అవగాహన కల్పించింది. ఈ క్రమంలోనే మహ్మద్ సిరాజ్ తనను సంప్రదించిన వ్యక్తి గురించి యాంటీ కరప్షన్ యూనిట్కు సమాచారం అందించాడు. అయితే, ఈ వ్యవహారానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.