న్యూఢిల్లీ : యూకే పర్యటనకు ముందు భారత క్రికెట్ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. తొడకండరాల గాయంతో యువ ఆల్రౌండర్ నితీశ్కుమార్రెడ్డి ఐర్లాండ్, ఇంగ్లండ్తో జరిగే టీ20 సిరీస్లకు దూరమయ్యాడు. గాయపడ్డ నితీశ్ స్థానంలో సూర్యాంశ్ షెడ్గేను ఎంపిక చేసినట్లు బీసీసీఐ మంగళవారం ప్రకటించింది.
అఫ్గానిస్థాన్తో మూడో వన్డే సందర్భంగా ఇబ్బందిపడ్డ నితీశ్ ఇప్పుడు బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్(సీవోఈ)లో రిపోర్ట్ చేయనున్నాడు. ఇటీవల ముక్కోణపు వన్డే సిరీస్లో భారత్-ఏ తరఫున నిలకడగా రాణించిన ముంబై క్రికెటర్ సూర్యాంశ్..తొలిసారి టీమిండియాకు ఎంపికయ్యాడు.