టోక్యో : పారా బ్యాడ్మింటన్ ప్రపంచ చాంపియన్షిప్లో భారత ఆటగాళ్లు నిత్య శ్రీ, మనిష రామదాసు సునాయాస విజయాలు నమోదు చేశారు. ఈ పోటీలలో తొలిసారి పాల్గొంటున్న నిత్య..కృష్ణ నగార్తో కలిసి ఎస్హెచ్6 విభాగం మిక్స్డ్ డబుల్స్లో 21-8, 21-9 స్కోరుతో యస్మిన ఇస్సా-ఇవాన్ ఎస్కోబార్ జోడిపై గెలుపొందారు. అనంతరం నిత్య శ్రీ మహిళల సింగిల్స్లో 21-4, 21-4తో హాకాంగ్కు చెందిన లామ్ చింగ్ యంగ్పై గెలుపొందింది. ఎస్యు5 విభాగంలో మనిషా రామదాసు 21-10-21-5తో స్పెయిన్కు చెందిన క్రిస్టినా సాండెజ్ డి లెచినపై విజయం సాధించింది. ఎస్హెచ్6 పురుషుల సింగిల్స్ గ్రూప్-డిలో కృష్ణ నగార్ 17-21, 21-16, 21-17తో అమెరికాకు చెందిన మైల్స్ కాజెస్కిని ఓడించాడు.