Virat Kohli: ఇండియా – ఇంగ్లండ్ మధ్య లక్నో వేదికగా జరుగుతున్న మ్యాచ్లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ డకౌట్ అయిన విషయం తెలిసిందే. గిల్ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన కోహ్లీ.. 9 బంతులు ఎదుర్కుని ఒక్క పరుగు కూడా చేయకుండానే పెవిలియన్ చేరాడు. అయితే కోహ్లీ నిష్క్రమించాక ఇంగ్లండ్ క్రికెట్ జట్టు వీరాభిమానులు అయిన ‘బర్మీ ఆర్మీ’ ట్విటర్ వేదికగా విరాట్ను అవమానపరిచే విధంగా ట్వీట్ చేసింది. కోహ్లీ ఔటయ్యాక రెండు బాతులు నీటిలో ఈత కొడుతున్న ఫోటోను ఎడిట్ చేస్తూ ఒకదాంట్లో కోహ్లీ ఫోటో పెట్టి ‘జస్ట్ మార్నింగ్ వాక్ కోసం వచ్చాను’ అని ట్వీట్ చేసింది.
దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన భారత క్రికెట్ అభిమానులు ఇంగ్లండ్కు సాలిడ్ రిప్లై ఇచ్చారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ మొదలయ్యాక ఆ జట్టు ప్రధాన బ్యాటర్లు అయిన జో రూట్ తో పాటు బెన్ స్టోక్స్లు సున్నాలు చుట్టారు. భారత పేసర్లు బుమ్రా, షమీల ధాటికి ఈ సీనియర్లిద్దరూ తంటాలు పడ్డారు. జో రూట్ ఎదుర్కున్నతొలి బంతికే ఎల్బీగా నిష్క్రమించగా.. పది బంతులు ఆడి ఒక్క పరుగు కూడా చేయకుండానే బెన్ స్టోక్స్ .. షమీ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో ఇండియన్ ఫ్యాన్స్.. బర్మీ ఆర్మీ ట్వీట్కు ఊపిరిసలపని రిప్లైలు ఇస్తూ ఆటాడుకుంటున్నారు. ‘జస్ట్ ఈవినింగ్ వాక్ కోసం వచ్చారా..?’, ‘కొంచెం ఎడిట్ చేసుకోవడానికైనా మాకు టైమ్ ఇవ్వండయ్యా’ అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Great evening walk for Joe Root and Ben Stokes 🙌🏻 https://t.co/QK7vo0ys67 pic.twitter.com/nlyRLDxrQZ
— All About Cricket (@allaboutcric_) October 29, 2023
Beautiful evening also? 😉 pic.twitter.com/hu8dXivm4d
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 29, 2023
కాగా లక్నోలో జరుగుతున్న మ్యాచ్లో భారత్ నిర్దేశించిన 230 పరుగుల ఛేదనలో ఇంగ్లండ్.. 20 ఓవర్లు ముగిసేసరికి ఐదు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ జట్టును ఆదుకుంటాడనుకున్న జోస్ బట్లర్ (10) కూడా కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 20 ఓవర్ల ఆట పూర్తయ్యేసరికి ఇంగ్లండ్.. 68 పరుగులు చేసింది. ఇంగ్లీష్ జట్టులో మోయిన్ అలీ (12), లియామ్ లివింగ్స్టోన్ (11) లు క్రీజులో ఉన్నారు.