IND vs ENG 2nd Test : ఐదు టెస్టుల సిరీస్లో కీలకమైన విశాఖ టెస్టులో టీమిండియా(Team India) టాస్ గెలిచింది. వైజాగ్ స్టేడియంలో భారత్కు మంచి రికార్డు ఉన్నందున కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ తీసుకున్నాడు. ఈ మ్యాచ్లో భారత్ మూడు మార్పులతో బరిలోకి దిగనుంది.
రంజీ వీరుడు సర్ఫరాజ్ ఖాన్కు మరోసారి నిరాశ మిగిలింది. ఇంగ్లండ్ లయన్స్పై సెంచరీతో కదం తొక్కిన రజత్ పాటిదార్(Rajat Patidar) అరంగేట్రం చేయనుండగా.. కుల్దీప్ యాదవ్, ముకేశ్ కుమార్లు జట్టులోకి వచ్చారు. గాయపడిన రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్ విశ్రాంతి ఇచ్చారు. హైదరాబాదీ స్పీడ్స్టర్ సిరాజ్ బెంచ్కే పరిమితమయ్యాడు. మరోవైపు ఇంగ్లండ్ తరఫున స్పిన్నర్ షోయబ్ బషీర్ డెబ్యూట్ క్యాప్ అందుకోనున్నాడు.
భారత జట్టు : రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వీ జైస్వాల్, శుభ్మన్ గిల్, రజత్ పాటిదార్, శ్రేయాస్ అయ్యర్, శ్రీకర్ భరత్(వికెట్), రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, ముకేశ్ కుమార్, కుల్దీప్ యాదవ్.
ఇంగ్లండ్ జట్టు : ఇంగ్లండ్ తుది జట్టు : జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, జానీ బెయిర్స్టో, బెన్ స్టోక్స్ (కెప్టెన్), బెన్ ఫోక్స్, రెహాన్ అహ్మద్, టామ్ హర్ట్లే, షోయబ్ బషీర్, జేమ్స్ అండర్సన్.