నాటింగ్హామ్: ఒలింపిక్స్ మానియాలో పడి క్రికెట్ను పట్టించుకోవడం లేదు కానీ.. అటు టీమిండియా ఓ ప్రతిష్టాత్మక సిరీస్కు సిద్ధమవుతోంది. బుధవారం నుంచే ఇంగ్లండ్తో ( India vs England ) ఐదు టెస్ట్ల సిరీస్ ప్రారంభం కానుంది. గత మూడు టూర్లలోనూ ఇంగ్లండ్లో ఇండియన్ టీమ్కు చేదు అనుభవమే ఎదురైంది. అయితే ఈసారి మాత్రం గెలిచే అవకాశాలు ఎక్కువగానే ఉన్నట్లు ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. అయితే ఇండియన్ టీమ్ లెజెండరీ ప్లేయర్ సునీల్ గవాస్కర్ మాత్రం మన టీమ్ పూర్తిగా ఆధిపత్యం ప్రదర్శిస్తుందని చెబుతున్నాడు.
ఇంగ్లండ్ వీక్గా ఉంది
ఇంగ్లండ్లో వాతావరణ పరిస్థితులను బట్టి ఇండియా ఈ సిరీస్ను 4-0 లేదా 3-1తో గెలుస్తుందని గవాస్కర్ అంటున్నాడు. ఏది ఏమైనా ఇండియా సిరీస్ గెలవడం మాత్రం పక్కా అని అతడు చెప్పడం విశేషం. న్యూజిలాండ్తో పోలిస్తే ఇంగ్లండ్ బ్యాటింగ్ లైనప్ చాలా బలహీనంగా ఉన్నదని సన్నీ చెప్పాడు. ఇంగ్లండ్లో ఒకవేళ పొడి వాతావరణం ఉంటే, అంటే 25 రోజుల్లో 22 రోజులు పొడి వాతావరణమే ఉంటే ఇండియా 4-0తో గెలుస్తుంది. ఒకవేళ వాతావరణం ఏమైనా ప్రభావం చూపితే ఇండియా 3-1తో విజయం సాధిస్తుంది. కానీ ఇండియా మాత్రం కచ్చితంగా గెలుస్తుంది అని గవాస్కర్ అన్నాడు. ఏడేళ్ల తర్వాత ఈ మధ్యే సొంతగడ్డపై న్యూజిలాండ్తో సిరీస్ ఓడిపోయింది ఇంగ్లండ్.
ఆండర్సన్పై కోహ్లిదే పైచేయి
ఇండియా, ఇంగ్లండ్ సిరీస్లో ప్రధానంగా విరాట్ కోహ్లి, జేమ్స్ ఆండర్సన్ మధ్య ఆసక్తికర ఫైట్ నడుస్తుందని అంచనా వేస్తున్నారు. 2014లో తొలిసారి కోహ్లి వెళ్లినప్పుడు ఆండర్సన్ పైచేయి సాధించాడు. అతని బౌలింగ్లో కేవలం 19 పరుగులు చేసిన విరాట్.. 4సార్లు అవుటయ్యాడు. ఇక 2018లో మాత్రం కోహ్లిదే పైచేయి. మొత్తం 114 పరుగులు చేసినా ఒక్కసారి కూడా ఆండర్సన్కు తన వికెట్ ఇవ్వలేదు. ఈసారి కూడా ఆండర్సన్పై కోహ్లిదే పైచేయి అవుతుందని గవాస్కర్ కూడా చెప్పాడు.