ఆమ్స్టెల్వీన్ : ఎఫ్ఐహెచ్ మహిళల హాకీ ప్రపంచకప్ను భారత్ ఐదో స్థానంతో ముగించింది. గురువారం జరిగిన క్లాసిఫికేషన్ మ్యాచ్లో స్టార్ ఫార్వర్డ్ నవనీత్ కౌర్ డబుల్ గోల్స్తో మెప్పించడంతో 3-1తో జర్మనీని ఓడించింది. 1974 తొలి ఎడిషన్లో నాలుగో స్థానంలో నిలిచిన తర్వాత ఈ టోర్నీలో భారత అమ్మాయిలకు ఇదే అత్యత్తమ ప్రదర్శన కావడం విశేషం.ఈ మ్యాచ్ ప్రథమార్ధంలో ఇరు జట్లు డిఫెన్స్ సత్తా చాటడంతో ఒక్క గోల్ కూడా రాలేదు.
అయితే, 43వ నిమిషంలో ఇషిక ఫీల్డ్ గోల్తో భారత్కు తొలి ఆధిక్యాన్ని అందించింది. 44వ నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్ను గోల్గా మలచిన నవనీత్.. 47వ నిమిషంలో ఫీల్డ్ గోల్తో జట్టు విజయం ఖాయం చేసింది. ఆట చివరి క్షణాల్లో లిన్ క్రింగ్స్ ఫీల్డ్ గోల్ సాధించినా అది జర్మనీ ఓటమి అంతరాన్ని మాత్రమే తగ్గించింది.