హైదరాబాద్: వన్ డే ప్రపంచకప్లో భాగంగా మంగళవారం శ్రీలంక-అఫ్ఘానిస్థాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో రికార్డుల మోత మోగింది. అతి భారీ టార్గెట్ చేజింగ్ మ్యాచ్గా, నలుగురు బ్యాటర్లు సెంచరీలు నమోదు చేసిన మ్యాచ్గానే గాక.. దాదాపు దశాబ్ద కాలం తర్వాత భారత గడ్డపై ఒక పాకిస్థానీ బ్యాటర్ సెంచరీ చేసిన మ్యాచ్గా కూడా ఈ మ్యాచ్ గుర్తింపు పొందింది.
శ్రీలంకతో మ్యాచ్లో పాకిస్థాన్ బ్యాటర్ అబ్దుల్లా షఫీక్ (113; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) సెంచరీ చేశాడు. భారత దేశంలో ఓ పాకిస్థానీ బ్యాటర్ సెంచరీ చేయడం గడిచిన పదేళ్లలో ఇదే తొలిసారి. అంతకుముందు 2013లో కోల్కతాలో జరిగిన మ్యాచ్లో పాకిస్థాన్ బ్యాటర్ నసీర్ జంషెడ్ సెంచరీ (106) చేశాడు. ఆ తర్వాత తాజాగా అబ్దుల్లా షేక్ చేసిందే తొలి సెంచరీ.