కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) నిర్వహిస్తున్న ఇండస్ట్రియల్ ప్రొఫిషియన్సీ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఫర్ ఇంజినీర్స్ (ఐప్యాట్) ప్రకటన విడుదలైంది.
ఐప్యాట్-2021
ఈ పరీక్ష ద్వారా ఇంజినీరింగ్, డిప్లొమా పూర్తిచేసిన అభ్యర్థులు వారి సాంకేతిక ప్రతిభను పరీక్షించుకోవచ్చు. అదేవిధంగా దేశంలోని పలు పరిశ్రమలతోపాటు సుమారు 133 దేశాల్లో ఐప్యాట్ పరీక్ష స్కోర్ను పరిగణనలోకి తీసుకుంటారు.
అర్హతలు: ఇంజినీరింగ్, డిప్లొమా ఉత్తీర్ణులు. లేదా ఫైనల్ ఇయర్ పరీక్షలు రాయనున్నవారు కూడా ఈ పరీక్షను రాయవచ్చు. వయోపరిమితితో సంబంధం లేదు.
ఈ పరీక్ష ఒక్కసారి రాస్తే మూడేండ్ల పాటు ఈ స్కోర్ వ్యాలిడిటీ కలిగి ఉంటుంది.
దరఖాస్తు: ఆన్లైన్లో
గ్రాడ్యుయేట్ ఇంజినీర్లకు చివరితేదీ: మార్చి 31
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్: జూన్ మొదటి, రెండో వారంలో నిర్వహిస్తారు డిప్లొమా ఇంజినీర్లకు దరఖాస్తు మే 1న ప్రారంభమవుతుంది.
చివరితేదీ: మే 20
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ తేదీ: సెప్టెంబర్లో
రాష్ట్రంలో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, సికింద్రాబాద్, వరంగల్.