దుబాయ్: టీమ్ఇండియా యువ క్రికెటర్లు శుభ్మన్ గిల్, ఇషాన్కిషన్..వన్డేల్లో తమ అత్యుత్తమ ర్యాంకింగ్ అందుకున్నారు. ఐసీసీ బుధవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్లో గిల్ 5వ ర్యాంక్ దక్కించుకోగా, ఇషాన్ కిషన్ 36వ ర్యాంక్లో నిలిచాడు. ఇటీవల వెస్టిండీస్తో జరిగిన వన్డే సిరీస్లో గిల్, కిషన్ మెరుగైన ప్రదర్శన కనబరిచారు.
ఈ క్రమంలో 743 పాయింట్లతో గిల్ రెండు ర్యాంక్లు మెరుగుపర్చుకుని ఐదో ర్యాంక్కు చేరుకోగా, కిషన్ ఏకంగా తొమ్మిది స్థానాలు ఎగబాకి 36కు చేరుకున్నాడు. విరాట్ కోహ్లీ(705) తొమ్మిదో ర్యాంక్లో కొనసాగుతున్నాడు. పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్(886) నంబర్వన్ ర్యాంక్లో కొనసాగుతున్నాడు. బౌలర్ల ర్యాంకింగ్స్లో సిరాజ్(670), కుల్దీప్యాదవ్(622) వరుసగా నాలుగు, పది ర్యాంక్ల్లో ఉన్నారు.