టీ20 ప్రపంచకప్లో భాగంగా ఇవాళ ఇంగ్లండ్, శ్రీలంక మధ్య పోరు జరుగుతోంది. టాస్ గెలిచి.. శ్రీలంక ఫీల్డింగ్ ఎంచుకోవడంతో ఇంగ్లండ్ బ్యాటింగ్ బరిలోకి దిగింది. ఈ మ్యాచ్లో శ్రీలంక ఎలాగైనా గెలవాల్సి ఉండటంతో.. శ్రీలంక బౌలర్లు రెచ్చిపోయారు. దీంతో ఇంగ్లండ్ 10 ఓవర్లకు మూడు వికెట్ల నష్టానికి 47 పరుగులు చేసింది.
మరోవైపు శ్రీలంక బౌలర్లలో చమీరా 2 ఓవర్లు వేసి 17 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు. డీసిల్వా 2 ఓవర్లు వేసి 2 వికెట్లు తీసి 5 పరుగులు ఇచ్చాడు. లహిరు 2 ఓవర్లలో 11 పరుగులు, మహీశ్ 3 ఓవర్లలో 11 పరుగులు, చమిక ఒక ఓవర్ వేసి మూడు పరుగులు అందించాడు.
ఇంగ్లండ్ ప్లేయర్లలో బట్లర్ ఒక్కడే టీమ్ను ఆదుకుంటున్నాడు. 30 బంతుల్లో 24 పరుగులు చేశాడు. ప్రస్తుతం క్రీజులో మోర్గాన్, బట్లర్ ఉన్నారు.