ఇంగ్లండ్తో జరుగుతున్న మ్యాచ్లో భారత జట్టు 8వ వికెట్ కోల్పోయింది. శార్దూల్ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన మహమ్మద్ షమీ (13) పెవిలియన్ చేరాడు. లంచ్ ముగిసిన తర్వాత ఇంగ్లండ్ సారధి బెన్ స్టోక్స్ తొలి ఓవర్ వేశాడు. ఆ ఓవర్ నాలుగో బంతికి భారీ షాట్ ఆడేందుకు షమీ ప్రయత్నించి విఫలమయ్యాడు.
ఈ క్రమంలో స్క్వేర్ లెగ్లో ఉన్న లీస్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో భారత జట్టు 230 పరుగుల వద్ద 8వ వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం జడేజా, బుమ్రా క్రీజులో ఉన్నారు. వీళ్లిద్దరూ ధాటిగా ఆడి భారత ఆధిక్యాన్ని 400 దాటిస్తారేమో చూడాలి.