బుకారెస్ట్ : మహిళల టీ20 క్రికెట్లో అరుదైన రికార్డు నమోదైంది. విమెన్స్ కాంటినెంటల్ కప్లో భాగంగా ఆస్ట్రియా, తుర్కియే మధ్య గురువారం జరిగిన మ్యాచ్లో ఓ ఇన్నింగ్స్లో ఏకంగా ఎనిమిది మంది సున్నా చుట్టారు. తుర్కియే బౌలర్ల దెబ్బకు ఆస్ట్రియా 8.1 ఓవర్లలో 35 పరుగులకే కుప్పకూలింది. శ్రేయ రెడ్డి చేసిన 8 పరుగులే జట్టులో అత్యధికం కాగా. బ్యాటర్లు చేసిన పరుగుల (16) కంటే ఎక్స్ట్రాల రూపంలోనే (19) ఎక్కువ రన్స్ రావడం గమనార్హం.
తుర్కియే బౌలర్లలో హసేర్ సెలిక్ 4, కెప్టెన్ కుబ్రా కనవర్సి 3 వికెట్లతో ఆస్ట్రియాను దెబ్బతీసింది. అనంతరం తుర్కియే 5.3 ఓవర్లలోనే 40/2 స్కోరు చేసి గెలిచింది. రెండు ఇన్నింగ్స్లు కలిపి ఈ మ్యాచ్ 82 బంతుల్లోనే (13.4 ఓవర్లు) ముగియడం విశేషం.