సూర్యాపేట రూరల్, సెప్టెంబర్ 20 : కారులో మంటలు చెలరేగి ఓ వైద్యుడు సజీవదహనమైన ఘటన సూర్యాపేట – ఖమ్మం జాతీయ రహదారిపై చోటు చేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట మండల పరిధిలోని పిల్లలమర్రి సమీపంలో ఓ కారు అదపుతప్పి డివైడర్ను ఢీకొనడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి వాహనం పూర్తిగా దగ్ధమైంది.
ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఖమ్మం మమత దవాఖానకు చెందిన న్యూరో సర్జన్ డాక్టర్ కాసకుర్తి జగదీశ్ మంటల్లో చిక్కుకుని సజీవ దహనమైనట్టు పోలీసులు గుర్తించారు. సూర్యాపేట రూరల్ ఎస్సై అనిల్రెడ్డి సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.