ముంబై: సీనియర్ పురుషుల క్రికెట్ జట్టుకు చీఫ్ సెలెక్టర్గా ఉన్న అజిత్ అగార్కర్(Ajit Agarkar) పదవీకాలం ఈనెలాఖరుతో ముగియనున్నది. కాంట్రాక్టు సమయం దగ్గరపడిన నేపథ్యంలో మళ్లీ అజిత్ అగార్కర్కు పొడిగింపు వస్తుందో లేదో తెలియడం లేదు. కానీ కొన్ని మీడియా సంస్థల ప్రకారం అగార్కర్ను ఆ పోస్టు నుంచి తప్పించనున్నట్లు తెలిసింది. భారత మాజీ సీనియర్ క్రికెటర్లు పార్ధీవ్ పటేల్, ప్రజ్ఞా ఓజా.. చీఫ్ సెలెక్టర్ రేసులో ఉన్నట్లు ఓ ఆంగ్ల మీడియా కథనాన్ని రాసింది. అజిత్ అగార్కర్ భవిష్యత్తుపై ఇటీవల ఊహాగానాలు వినిపిస్తున్న విషయం తెలిసిందే.
వచ్చే ఏడాది వరల్డ్కప్ వరకు అగార్కర్ కాంట్రాక్టు పొడిగిస్తారని కూడా రూమర్స్ వినిపిస్తున్నాయి. కానీ బీసీసీఐలోని కొన్ని వర్గాలు.. అగార్కర్ పదవీకాలం ముగిసినట్లు చెబుతున్నారు. శుక్రవారం జరగనున్న బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశంలో అగార్కర్ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అగార్కర్ తన చివరి సెలెక్షన్ మీటింగ్ను బుధవారమే నిర్వహించినట్లు కొన్ని వర్గాలు పేర్కొన్నాయి.
బీసీసీఐ సెలెక్షన్ కమిటీ చైర్మెన్ రేసులో మాజీ వికెట్ కీపర్ పార్దీవ్ పటేల్, స్పిన్నర్ ప్రజ్ఞా ఓజా ఉన్నట్లు తెలుస్తోంది. ఆ ఇద్దరూ మూడుసార్లు ఐపీఎల్ విజేతలుగా నిలిచారు.