న్యూఢిల్లీ: దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ఖేల్ రత్నకు తెలుగు షట్లర్లు కిడాంబి శ్రీకాంత్, సాయిప్రణీత్ పేర్లను భారత బాడ్మింటన్ సంఘం (బాయ్) ప్రతిపాదించింది. అర్జున అవార్డు కోసం హెచ్ఎస్ ప్రణయ్, ప్రణవ్ చోప్రా, సమీర్వర్మను క్రీడామంత్రిత్వ శాఖకు నామినేట్ చేసింది. 2019 ప్రపంచ చాంపియన్షిప్లో కాంస్యం గెలిచిన ప్రణీత్.. టోక్యో ఒలింపిక్స్ పురుషుల సింగిల్స్ బ్యాడ్మింటన్కు అర్హత సాధించిన ఏకైక భారత ప్లేయర్గా నిలిచాడు. ద్రోణాచార్య కోసం తెలంగాణ వెటరన్ కోచ్ పీయూ భాస్కర్, మురళీధరన్ పేర్లను బాయ్ నామినేట్ చేసింది.